

కాంగ్రెస్ ప్రభుత్వం పై పోరాటానికి సిద్ధం..
రజతోత్సవ సభను విజయవంతం చేయండి..
మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్, మాజీ శాసనసభ్యులు ఓడితల సతీష్ కుమార్,
ఎమ్మెల్సీ రవీందర్ రావు
వరంగల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం..
జనం న్యూస్ 17 ఏప్రిల్ 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)
ఎల్కతుర్తి మండల కేంద్రంలోని చింతలపల్లి వద్ద భారీ బహిరంగ సభ పనులను పరిశీలించిన కొప్పుల ఈశ్వర్ ఓడితల సతీష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ. లక్షలాదిమంది రాబోవు ఈ సభ కోసం అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తున్నాము పార్కింగ్ మరియు తాత్కాలిక అంబులెన్స్ సౌకర్యం 20 పడకల హాస్పిటల్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు 33 జిల్లాల ప్రజలు స్వచ్ఛందంగా సభకు వస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వంచిస్తుంది మళ్ళీ మాకు కేసీఆర్ పాలన కావాలి కేసిఆర్ ప్రభుత్వమే రావాలి బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే మాకు న్యాయం జరుగుతది అని ప్రజలు స్వచ్ఛందంగా బహిరంగ సభ కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు సభకు సంబంధించి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు అనంతరం సతీష్ కుమార్ మాట్లాడుతూ.సభా పనులు వేగంగా జరుగుతున్నాయి సభ కోసం వచ్చే కార్యకర్తలకు అన్ని రకాల సదుపాయాలు చేస్తున్నట్లు తెలిపారు 10 లక్షల వాటర్ బాటిల్ 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు అందించేందుకు సిద్ధం చేస్తున్నామన్నారు భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలోమండల పార్టీ అధ్యక్షులు పిట్టల మహేందర్, మండల సీనియర్ నాయకులు తంగేడ మహేందర్, తంగేడ నగేష్, కడారి రాజు,గోల్లే మహేందర్, సూరంపల్లి పరశురాం, గుండేటి సతీష్ నేత, కొమ్మిడి మహిపాల్ రెడ్డి, జూపాక జడ్సన్, సాతూరి శంకర్, మదార్, ఈర కమలాకర్, కుర్ర సాంబమూర్తి గౌడ్, మదన్ మోహన్ రావు, వేముల శ్రీనివాస్,డుకిరే రాజేశ్వర్ రావు, శివాజీ, సతీష్,రాజేశ్వరరావు శ్రీకాంత్ యాదవ్, చిట్టి గౌడ్,కోరే రాజ్ కుమార్,ఉట్కూరి కార్తీక్ సుర సాంబరాజు, డెంగు రమేష్, తక్కలపల్లి వినయ్ రావు, ఎర్రబెల్లి దిలీప్ రావు, బొంకురి కార్తీక్ ,భగవాన్,అనిల్, మురళి,తదితరులు పాల్గొన్నారు
