

జనం న్యూస్ ఏప్రిల్ 18 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు చేసుకున్న వారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆదేశాల ప్రకారం సభ్యత్వ నమోదు కార్డులు పంపించారని, ఈ కార్డులను ఈరోజు ఉదయం మాజీ శాసనమండలి సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరరావు పీల వెంకటరెడ్డినాయుడు వీధిలో సమావేశం ఏర్పాటు చేసి ఈ కార్డు తాలూకా ప్రాముఖ్యత, ప్రమాదంలో చనిపోయిన వారు ఎవరైనా ఉంటే వారికి ఐదు లక్షలు బీమా వర్తించే విధంగా చంద్రబాబు నాయుడు లోకేష్ చర్యలు తీసుకొని పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు గత 2014 నుండి బీమా సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని, అలాగే కుటుంబ సభ్యులకి విద్య వైద్యం సహాయం కూడా ఈ కార్డు ఉన్నవారికి ప్రత్యేకంగా గుర్తింపు ఇవ్వడం జరుగుతుందని తక్షణమే సహాయం అందిస్తారని నాగ జగదీష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ చలనచిత్ర రంగంలో దేశానికే ప్రత్యేకతను తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి దారిద్రరేఖ దిగువ ఉన్న ప్రజలు కష్టాలను చూసి తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావు దేశంలోనే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందని, పెన్షన్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ఏర్పాటు చేసి బడుగు బలహీన హరిజన గిరిజన వర్గాలకు చేయూతను అందించారని బీసీలకు రక్షణ చట్టాన్ని త్వరలో కూటమి ప్రభుత్వం తీసుకురాబోతుందని, మరో ఐదు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడుతుందని, వయోపరిమితిని 42 సంవత్సరాల నుండి 44 సంవత్సరాలకు కల్పించి నిరుద్యోగులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవడంతో వేలాది మందికి ప్రవేశ పరీక్షలో అర్హత సంపాదించారని నిరుద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని స్పష్టం చేశారని నాగ జగదీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో సదరం శివ అప్పారావు పెంటకోట శివరాం బొడ్డేడ ఈశ్వర్ అయ్యప్ప కొణతాల బాబురావు కొణతాల గణేష్ కాండ్రేగుల శ్రావణ్ తదితరులకు, మహిళా సంఘ సభ్యులకు ట్యాగ్ తో కూడిన ఐడెంటి కార్డులను నాగ జగదీశ్ చేతుల మీదుగా అందించారు.//