Listen to this article

ఏళ్లనాటి ఆలయం పునర్నిర్మాణం పునరుద్ధరణ….300

జనం న్యూస్:18 ఎప్రిల్ శుక్రవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;-

ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ వరుణ్ కుమార్ చే దేవాలయ పునర్నిర్మాణం

-శ్రీ నందగిరి లక్ష్మణాచార్య గారి ఆధ్వర్యంలో హోమం, ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహణ మూడు రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు శ్రీ వేంకట లక్ష్మి నరసింహా స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన గ్రామ ప్రజలు సిద్దిపేట టౌన్: మండలంలోని రావురూకుల గ్రామములో 300 సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీవేంకట లక్ష్మి నారసింహ స్వామి జీర్ణ దేవాలయమును పునరుద్ద రిoపబడినది. స్వామి వారి పునః ప్రతిష్ట గ్రామంలో గ్రామ ప్రజల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామానికి చెందిన గ్రామ వంశ పారంపర్య పూజారులు కందుకూరి వంశస్తులచే 300 సంవత్సరాల క్రితం ఈ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. గ్రామానికి చెందిన వంశపారంపర్య పూజారులు కందుకూరి మనోహర్ కుమారుడైన ప్రమిఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ కందుకూరి వరుణ్ కుమార్ ఎలాగైనా తన తాతలు నిర్మించిన ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని సంకల్పించాడు. ఈ దేవాలయమును ప్రత్యేక నిపుణులచే కళాత్మకంగా పునర్నిర్మాణం చేశారు . శ్రీ నందగిరి లక్ష్మణాచార్య గారి ఆధ్వర్యంలో యజ్ఞ యాగాదులు ఈ నెల 12 నుంచి 14 వరకు నిర్వహించారు పూజారుల హోమం, పూజా కార్యక్రమములతో దేవాలయములో స్వామివారి పునః ప్రతిష్టాపన గ్రామ ప్రజల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో గ్రామ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వంశ పారంపర్య పూజారులు కందుకూరి మనోహర్ గారి సోదరులు కందుకూరి ధనంజయ , కందుకూరి నాగేందర్ , కందుకూరి శ్రీరాములు కందుకూరి శేషుకుమార్ , పురప్రముఖులు , గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.