

ఏప్రిల్ 18.2025.
క్రీస్తుకు సిలువ వేసే గుడ్ఫ్రైడే ప్రార్థనలు శుక్రవారం కొత్తగట్టు సింగారం గ్రామ క్రైస్తవ విశ్వాసులు అంత భక్తిశ్రద్ధలతో ఆత్మకూర్ చర్చిలో పాల్గొన్నారు. ఆత్మకూర్ లోని సెయింట్ థెరిస్సా స్కూల్ ఆవరణంలో ఫాదర్ అల్లం ఇన్నా రెడ్డి గారి ఆధ్వర్యంలో పరిశుద్ద సిలువ మార్గం ప్రార్థనలు జరిగాయి. లోక రక్షకుడైన క్రీస్తు.. సర్వ మానవపాప విముక్తి కోసం మరణ శిక్ష పొందిన రోజును శుభ శుక్రవారంగా పేర్కొంటూ క్రైస్తవ విశ్వాసులందరూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కరుణామయుడు సిలువ మోసిన రోజును స్మరించారు. ఈ శుభ శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలతో అన్ని క్రైస్తవ మందిరాలూ కిక్కిరిశాయి. మానవులు చేసిన పాపాలను తను మోస్తూ సిలువపై ప్రాణాలను అర్పించి త్యాగాన్ని చాటిన ఏసును స్తోత్రాలతో కీర్తించారు. సిలువ ధ్యానాన్ని పాటించారు. భక్తితో 40 రోజులపాటు ఉపవాస దీక్షలు ఆచరించిన విశ్వాసులు.. శుక్రవారం వాటి విరమణ చేశారు. సంప్రదాయం ప్రకారం పేదలకు దానం చేశారు. అనంతరం చర్చిలకు తరలివెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా క్రీస్తు సిలువ మార్గ దృశ్యాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. ప్రభువు నడిచిన పరిశుద్ధ సిలువ మార్గంలోని 14 స్థలాల్లో ఏసు భరించిన కష్టాలను కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రభువు సిలువ మోసిన నేపథ్యం, ఏసు బోధనలు, సందేశాలు, వాక్యాలను మత పెద్దలు వినిపించారు. అధిక సంఖ్యలో విశ్వాసులు హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గుడ్ఫ్రైడే ప్రాధాన్యాన్ని వివరించారు. ఈ పండుగ దేవుడికి మానవుడికి, మానవుడికి మానవుడికి గల ప్రేమ సంబంధాన్ని చాటుతుందని అన్నారు. జీవితంలో మానవులు పాపాలను చేయకుండా ఉండాలని, ప్రేమతో జీవించాలని, దేవుడి మార్గాన్ని ఎంచుకోవాలని ఉపదేశించారు. బైబిల్ వాక్యాలను పాఠించారు. విశ్వాసులు,సంఘపెద్దలు, యువతీ యువకులు పాల్గొన్నారు.
పెంబర్తి వినయ్, కిషోర్, సంపత్, మల్లయ్య, రమేష్ బాబు, కోర్నెల్,మహేష్ ,మనోజ్,కమల్, శ్రీను తదితరులు ఉన్నారు.