Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 18(నడిగూడెం)

మోదీ ప్రభుత్వం అధికార బలంతో కాంగ్రెస్ అగ్ర నాయకులను కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తుందని యూత్ కాంగ్రెస్ నడిగూడెం మండల అధ్యక్షుడు గుండు మహేందర్ గౌడ్ ఆరోపించారు. శుక్రవారం కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ లో నేషనల్ హెరాల్డ్ కేసు లో సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్ షీట్ లో దాఖలు చేయడం ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.. ఈ కార్యక్రమం లో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ గడ్డం మల్లేష్ యాదవ్, సీనియర్ నాయకులు కాసాని వెంకన్న,చిల్లంచర్ల సత్యనారాయణ, చెన్నూరు లోకేష్, ఎలకా వెంకట రెడ్డి, ఎలక రాంరెడ్డి, సోమయ్య యాదవ్, కాసాని బిక్షం మైనార్టీ నాయకులు ఖాసిం,సోషల్ మీడియా మండల నాయకులు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.