Listen to this article

జనం న్యూస్ // ఏప్రిల్ // 18 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..

అపర భద్రాద్రిగా పేరుపొందిన ఇల్లంతకుంట లోని శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసిన పోలీసుల సేవలు చిరస్మరణీయమని ఇల్లంతకుంట ఆలయ కమిటీ చైర్మన్ ఇంగిలే రామారావు అన్నారు. శుక్రవారం జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి, రూరల్ సీఐ కోరే కిషోర్, ఇల్లంతకుంట ఎస్ఐ రాజకుమార్, వీణవంక ఎస్ఐ తోట తిరుపతి ని మర్యాద పూర్వకంగా కలిసి వారికి స్వామి వారి ప్రసాదం మెమొంటో కళ్యాణం అక్షింతలు అందించి వారిని శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపినట్లు రామారావు పేర్కొన్నారు. అనంతరం రామారావు మాట్లాడుతూ, 13 రోజులపాటు సాగిన బ్రహ్మోత్సవాలలో పోలీస్ శాఖ అందించిన సేవలు అభినందనీయమని వారిని ఈ సందర్భంగా కలుసుకొని చిరు సన్మానం చేయడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలోధర్మకర్తలు. పరమేశ్వర్,రవికిరణ్,గోపాల్ రెడ్డి ,కిషన్ రెడ్డి, ,చిరంజీవి,రామ్ రెడ్డి,నాగరాజు, లావణ్య శ్రీనివాస్ ,నారాయణ రెడ్డి,రాజేందర్, మల్లేష్ తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.