Listen to this article

బిచ్కుంద ఏప్రిల్ 18 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సహకారంతో సీసీ 13వ వార్డులో సీసీ రోడ్ నిర్మాణం కొరకు రూ .10 లక్షల NREGS నిధులతో సీసీ రోడ్డు పనులను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున అప్ప సెట్ కారు కొబ్బరికాయలు కొట్టి సీసీ రోడ్డు ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమంలో బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయిని అశోక్ , నౌషా నాయక్, మీసేవ బాబు సీమ గంగారం , మైనార్టీ నాయకుడు ఖలీల్ ,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు