Listen to this article

ధర్మ సమాజ్ పార్టీ ( డి.ఎస్.పి ) సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు చందు మహారాజ్ డిమాండ్.

జనం న్యూస్, ఏప్రిల్ 19 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )

నల్లగొండ జిల్లా,నిడమానూరు మండలం, బొక్కమంతల పాడు గ్రామానికి చెందిన మల్లీశ్వరి ని పెండ్లి చేసుకుంటానని నమ్మించి, ఎంతో కాలం సహజీవనం చేసి చివరికి ఆమెను మోసం చేసి వేరే పెళ్ళి చేసుకున్న జాన్ రెడ్డి పై మరియు అతని కుటుంబ సభ్యులపై వెంటనే మర్డర్ కేసు నమోదు చేసి తక్షణం అరెస్టు చేయాలి. అగ్రకుల రెడ్ల కుల అహంకారానికి బలి అయిన మాదిగ బిడ్డ దర్మారపు మల్లీశ్వరి,కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, ప్రధాన నిందితుడు జాన్ రెడ్డి ని, కుటుంబ సభ్యులందరినీ కఠినంగా శిక్షించాలని… నిందితుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తీ కావడం తో రక్షించే పని లో రెడ్డి సామాజిక వర్గం పనిచేస్తుందని ధర్మ సమాజ్ పార్టీ – ( డి.ఎస్.పి) నాయకులు ఆరోపించారు.
న్యాయం జరిగేంత వరకు, రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలు, ధర్నాలు చేపడుతామని తెలిపారు.