Listen to this article

మండల మాజీ కో ఆఫ్షన్ ఎక్బల్

జనం న్యూస్, ఏప్రిల్ 19 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )

జగదేవపూర్ ఈ నెల 27 వ తేదీన వరంగల్ లో జరిగే బి అర్ ఎస్ పార్టీ రజతోత్సవం బహిరంగ సభకు జాగదేవపూర్ మండలం నుంచి భారీ సంఖ్యలో తరలి రావాలని మండల మాజీ కో అప్షన్ ఎక్బాల్ పిలుపునిచ్చారు, శుక్రవారం మండల కేంద్రము లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు జగదేవపూర్ మండల వ్యాప్తంగా బి అర్ ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ లు,ఎంపిటిసి లు , నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో తరలి రావాలని ఆయన కోరారు.
ప్రజా వ్యతిరేక విధానంతోనే తిరిగి ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతు భరోసా, రుణమాఫీ పేరుకు మాత్రమే అమలు చేసినట్టు దుయ్యబట్టారు. అదేవిధంగా మహిళలకు రూ.2500, రూ.4000, తులం బంగారం, లక్ష రూపాయల నగదు పథకాలను అమలు చేయలేదన్నారు. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు రూ.12000 అమలు కాలేదన్నారు. కౌలు రైతులకు రూ.15000 ఇస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పి అమలు చేయలేదన్నారు. సాగునీరు అందించకపోవడంతో పంటలు ఎండిపోయాయన్నారు. గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం కేసీఆర్ కేటాయించిన రూ.180 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేసిందన్నారు. దాంతో గజ్వేల్ అభివృద్ధి కుంటుపడిందన్నారు. కాగా నేడు తిరిగి మండల ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. వరంగల్ లో జరిగే బహిరంగ సభకు జగదేవపూర్ మండలం లోని ఇరవై తొమ్మిది గ్రామాల నుంచి భారీ సంఖ్యలో తరలిస్తున్నట్టు అందుకు కావాల్సిన వాహనాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్, హరష్ రావు నాయకత్వంలో ముందుకు వెళ్తున్నామన్నారు.