

జనం న్యూస్ ఏప్రిల్ 18 కాట్రేనికోన (ముమ్మిడివరం ప్రతినిధి)
18.4.2025 అనగా శుక్రవారం సాయంత్రం అమ్మవారి గరగ ఎత్తే కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ ఆణి విళ్ళ సాయిబాబా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అర్చకులు ఫణికాంత్ శాస్త్రి గరగలకు ప్రత్యేక పూజలు నిర్వహించినారు. ప్రధాన ఆసాది మందపల్లి మహేష్ మరియు వారి కుమారులైన సూర్య దుర్గాప్రసాద్ కు మరియు నాగ వీరభద్ర రావు లకు ఎంపీపీ కోలాటి సత్యవతి సత్యం దంపతులు మరియు కంచు స్తంభం సోనీ చేతుల మీదుగా గరగలను లను అందజేయడం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో భాగంగా ఆకొండి శంకర శాస్త్రి, మహేష్, రాంప్రసాద్, రామకృష్ణ పరమహంస, ప్రకాశరావు , కాశీ విశ్వనాథం, శేష సాయి, చెరుకు శ్రీకృష్ణ, బాపిరాజు, తాతపూడి గోపి, శ్రీకాంత్, కిరణ్, పవన్, బాపన్న శాస్త్రి, భక్త జనావళి తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 29వ తారీకు నుండి మే 5 వ తారీకు వరకు అమ్మవారి జాతర మహోత్సవాలు వివిధ భక్తబృందాలచే.నిర్వహించబడును మే ఆరో తారీకు మంగళవారం నాడు అమ్మవారి తీర్థ మహోత్సవం జరుగును
