Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

నాగిరెడ్డిపల్లి లో పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని నందలూరు మండలం సర్పంచుల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ అన్నారు. శనివారం నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ లో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా రైల్వే స్టేషన్ బస్టాండ్ ప్రధాన రహదారిలో ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా పరిశుభ్రత మన అందరి బాధ్యత. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్లాస్టిక్ వ్యర్ధాల వాడకం తగ్గించాలని నినాదాలు చేశారు . అనంతరం మానవహారం నిర్వహించి స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాజంపేట అసెంబ్లీ అధికార ప్రతినిధి కానకుర్తి వెంకటయ్య సచివాలయం 2కార్యదర్శి వెంకటరమణ వెల్ఫేర్ చంద్రశేఖర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ రామాంజనేయులు క్లర్క్ నరసింహులు వెలుగు సిసి రామ్మోహన్ డ్వాక్రా మహిళలు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.