Listen to this article

మద్నూర్ ఏప్రిల్ 19 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలో శనివారం రోజు ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో ప్రజలలో “కల్తీ కల్లు, నివారణపై డ్రగ్స్, గంజాయి వాడటం వలన కలిగే దుష్ప్రభావాల” పైఅవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దరస్వర్ సాయిలు, నార్కోటిక్ సిఐ శ్రీనివాస్, ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎస్సై విజయ్ కొండ ఈ సందర్భంగా మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు, పౌరులుగా తమ పాత్ర ఎలా ఉండాలి, NDPS act తదితర అంశాల గురించి ప్రజలకు వివరించారు. యువత ఈ దారుణపు అలవాట్ల నుంచి దూరంగా ఉండాలన్న సందేశాన్ని ఇచ్చారు. అధ్యక్షులు సాయిలు మాట్లాడుతూ, ” డ్రగ్స్ బారిన పడిన వ్యక్తులు జీవితంలో దాని నుండి తప్పించుకోలేరని ఆ వ్యసనం నుండి దూరంగా ఉండాలని ,మన గ్రామీణ ప్రాంతాలలో దీన్ని నివారించడంలో యువత తో పాటు ప్రతి ఒక్కరి భాగస్వామ్యం తప్పనిసరి అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మేము రాజకీయ నాయకులుగా ముందుకు వచ్చి ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు కృషి చేస్తాం” అన్నారు. ఈ కార్యక్రమంలో సలాబత్పూర్ హనుమాన్ టెంపుల్ చైర్మన్ రామ్ పటేల్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు హన్మాండ్లు స్వామి ,జావిద్ పటేల్ , చందు, తదితరులు పాల్గొన్నారు.