

ఐ ఎన్ టి యు సి ఫెడరేషన్ నూతన అధ్యక్షుడు శ్రీనివాస్ కి ఘన సన్మా నం..
జనం న్యూస్ // ఏప్రిల్ // 19 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
కరీంనగర్ జిల్లా ఐ ఎన్ టి యు సి ఫెడరేషన్ నూతన అధ్యక్షుడిగా నియామకమైన అంబాల శ్రీనివాస్ ను కరీంనగర్ లో ఘనంగా సన్మానించడం జరిగింది. ఆర్ఎంపీ డాక్టర్ అసోసియేషన్ మరియు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అంబాల శ్రీనివాసు కి అభినందనలు తెలియజేశారు. మరియు ఆత్మీయ సన్మాన సభకు ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ మురహరి బుద్దారం, ఐ ఎన్ టి యు సి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు , ముఖ్య అతిథులుగా రావడం జరిగింది.శ్రీనివాస్ ని ఘనంగా సన్మానం చేసి, ప్రశంసలు తెలియజేశారు. అలాగే ఇ కార్యక్రమం లో వర్కింగ్ ప్రెసిడెంట్ మణికంఠ, ఉపాధ్యక్షులు రాజు, మహిళా విభాగం అధ్యక్షులు మన్నే శరణ్య రెడ్డి, ఆర్.ఎం.పి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఆర్.ఎం.పి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శంకర్, మరియు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.