Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 20(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీ

మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో హై స్కూల్ మరియు ప్రాథమిక పాఠశాలల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది.. గ్రామంలో ప్రైవేటు పాఠశాలలో చదువుకునే విద్యార్థిని,విద్యార్థుల ఇంటికి వెళ్లి, ప్రభుత్వ పాఠశాలలు ముద్దు, ప్రైవేట్ పాఠశాలలు వద్దు,అనే నినాదంతో మన పాఠశాలని మనం కాపాడుకుందాం.అనే నినాదంతో విద్యార్థులతో ర్యాలీ తో ఇంటి ఇంటికి తిరిగి విద్యార్థులని పాఠశాలకు పంపించే విధంగా బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో హై స్కూల్, ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్లు శ్రీనివాస్ రెడ్డి, అన్నపూర్ణ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వ్యాయామ టీచర్లు,స్కూల్ చైర్మన్ ధనలక్ష్మి, లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ మేదరమెట్ల వెంకటేశ్వరరావు, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు నందిగామ సైదులు, మాజీ ఉప సర్పంచ్ రావులపెంట బ్రహ్మం, సింగిల్ విండో డైరెక్టర్ నిడిగొండ శంబయ్య, వి. బి. కె వట్టెపు చిన్న సైదులు, షేక్ అత్తర్ పాషా విద్యార్థినీ విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు..