Listen to this article

జనం న్యూస్ 19 ఏప్రిల్ ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ )

వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మంచన్ పల్లి అంగన్ వాడి 1 సెంటర్ లో పోషణ పక్వాడ కార్యక్రమం చేయడం జరిగింది. గర్భిణి స్త్రీలు, బాలింతలు తీసుకోవలసిన పోషకాహారం గురించి 1000 రోజుల ప్రాముఖ్యత గురించి SAM, MAM గురించి చెప్పడం జరిగింది. అలాగే గర్భిణీ స్త్రీలకు శ్రీమంతము ఆరు నెలల నిండిన పిల్లలకు అన్నప్రాసన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ T. అనసూయ, సావిత్రి, అనూష్, స్వప్న, పావని, శావణి, పద్మ, భాగమ్మ, అంజమ్మ, మంజుల, ప్రవళిక, స్వాతి పిల్లల తల్లిపాడ్రులు, కిశోర బాలికలు,0-6 సంవత్సరాల పిల్లలు పాల్గొనడం జరిగింది.