Listen to this article

జనం న్యూస్. ఏప్రిల్ 18. సంగారెడ్డి జిల్లా. పటాన్చెరు.

నిరుపేద కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి మృతి చెందడంతో దహన సంస్కరణ నిమిత్తం ఏకే. ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ తన వంతు ఆర్థిక సహాయం అందజేశారు. రామచంద్రపురం మండలం భారతి నగర్ డివిజన్ ముంబై కాలనీ లో నివాసముంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన సురకంటి బాలరాజు పేదరికంతో బతుకుతున్నారు. గురువారం రాత్రి పనులు ముగించుకుని తనఇంటికి ప్రయాణమైన క్రమంలో కాళ్లు జారి కింద పడిపోగా తలకు బలమైన గాయం తగలడంతో మృతి చెందడం జరిగింది. బాలరాజు కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో దహన సంస్కారాల నిమిత్తం సహాయం చేయాలని కోరగా తన వంతు సహాయంగా బాలరాజు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏకే. ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ మాట్లాడుతూ కులమతాలకు, పార్టీలకతీతంగా నిరుపేదలకు ఎల్లవేళల తన వంతు సహాయ సహకారాలు ఉంటాయి అన్నారు. ఎవరికైనా ఇబ్బందులు తలెత్తుతే తన దృష్టికి తీసుకొచ్చినట్లయితే తన వంతు సహాయం,సహకారాలు అందిస్తానని తెలిపారు.