Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 19 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

రాష్ట్ర ప్రభుత్వ తెలుగు భాష విశిష్ఠ పురస్కార గ్రహీత డాక్టర్ దార్ల బుజ్జిబాబుకు పార్వతీపురంలో సాహితీలహరి బాల సాహిత్య పురస్కారం, బాల సాహిత్య భూషణ్ బిరుదు ప్రధానం చేయడం జరిగింది.మన్యం జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ చేతులమీదుగా అందుకున్నారు.శనివారంజ్ఞానేశ్వరి ఆర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటి ఆధ్వర్యంలోపట్టణ ములోని చౌత్ర సెంటర్ లోని గల వాసవీ జ్ఞాన మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.శ్రీను నాయక్ దార్ల బుచ్చిబాబు దంపతులకు దుశ్యాలువాతో ఘనంగా సత్కరించారు.2025 నూతన సంవత్సర డైరీని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెల్ ఫోన్లకు అలవాటు పడుతున్నటువంటి తరుణంలో విద్యార్థిని, విద్యార్థుల్లో తన కథల ద్వారా ఉల్లాసాన్ని కలిగించే విధంగా చేయడమే కాకుండా సాహితీ పుస్తకాల ద్వారా విద్యార్థులు, యువతను చైతన్య పరుస్తున్నారు. చిలకలూరిపేట ప్రజానీకం గర్వించే విధంగా బాల సాహిత్య భూషణ్ బిరుదు పట్ల సంతోష వ్యక్తం చేస్తున్నామన్నారు. సీనియర్ పాత్రికేయులుగా చిలకలూరిపేటలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని, ఇలాంటి అవార్డు మరెన్నో అందుకోవాలని ఆకాంక్షిస్తున్నామన్నారు.