

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 19 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 లో భాగంగా ప్రతినెల మూడవ శనివారం స్వచ్ఛత వారంగా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు చిలకలూరిపేట పట్టణంలోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మున్సిపల్ ప్రాథమిక పాఠశాల యందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థులతో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా చిలకలూరిపేట మండల విద్యాశాఖ అధికారి ఏ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు మొక్కలు నాటడం వాటిని పరిరక్షించే బాధ్యత చేపట్టాలని విద్యార్థులకు తెలిపారు పరిసరాల పరిశుభ్రత పై విద్యార్థులకుఅవగాహన కల్పించడం జరిగింది. ప్లాస్టిక్ ని నిషేధించాలని కాలువల్లో చెత్త వేయరాదని తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని విద్యార్థులకు తెలిపారు ప్రతి పాఠశాలలో ఈ స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించాలని ఈ మేరకు పాఠశాల ఆవాస ప్రాంత, పరిసరాలను. తరగతి గదులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పాఠశాలను పచ్చదనంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుకోవాలని విద్యార్థులకు సూచించడం జరిగింది,ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు అందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రతే ఆరోగ్య భద్రతగా గుర్తించాలని, వ్యాధులువచ్చాక చికిత్స తీసుకునే కంటే వ్యాధులు రాకుండా నివారించడం ముఖ్యమని తెలియజేశారు. పాఠశాల స్వచ్ఛ కమిటీఏర్పాటు. చేతులు పరిశుభ్రం చేసుకోవటం లోని వివిధ పద్ధతులు గురించి తెలియజేయడం జరిగింది. మధ్యాహ్న భోజనం ముందు చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని తెలిపారు.అనంతరం పాఠశాల ఆవాస ప్రాంతంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది.చెట్లు పెంచాలి -కాలుష్యాన్నివారించాలి, వ్యక్తిగత పరిశుభ్రత -ఆరోగ్య భద్రత, వద్దు వద్దు ప్లాస్టిక్ వద్దు, వంటి నినాదాలతో ర్యాలీ చేపట్టడం జరిగింది. అనంతరం మధ్యాహ్నం భోజనం రిజిస్టర్లు రికార్డులు చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే సుధా ఉపాధ్యాయులు పోటు శ్రీనివాసరావు,యన్ అంజమ్మ. ఐ ఆర్ టి టీచర్లు కే విశ్వప్రసాద్ ఎం అప్పారావు. పేరెంట్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.