

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 19 రిపోర్టర్ సలికినీడి నాగరాజు చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ.
భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టాన్ని ప్రవేశపెట్టి భారత దేశంలో లౌకికవాదాన్ని దెబ్బ కొట్టాలని , మతాల మధ్య చిచ్చు పెట్టాలని చేస్తున్న ప్రయత్నాలను శాంతియుతంగా తిప్పికొట్టేందుకు భారతీయులందరూ ఐక్యంగా ముందుకు సాగేందుకుగాను అంజుమన్- ఎ- ఇస్లామియా కమిటీ చేపట్టిన శాంతి ప్రదర్శనలో చిలకలూరిపేట నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లౌకికవాదులు భారత రాజ్యాంగాన్ని గౌరవించేవారు దేశ ప్రజల ఐక్యతను కోరుకునేవారు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. సవరణ చట్టం విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు శాంతి యుత ప్రదర్శన ద్వారా తెలియ చెప్పాలని విజ్ఞప్తి చేసారు. ఈ ప్రకటనపై చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎం రాధాకృష్ణ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి గోవిందు శంకర శ్రీనివాస్ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ కార్యదర్శి ఉప్పుటూరి అనిల్ కుమార్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం ప్రసన్న మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బేతంచెర్ల రామకోటేశ్వరరావు కాంగ్రెస్ మైనారిటీ నాయకులు హాజీ షేక్ సలాం షేక్ నసీరుద్దీన్ షేక్ మస్తాన్ వలి మహమ్మద్ అక్బర్ నాదెండ్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ బాజీ, యడ్లపాడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సాగి నరసింహారావు చిలకలూరిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మద్దాలి శ్రీనివాసరావు మూడు మండలాల మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ అమానుల్లా షేక్ బాజీ షేక్ నాగూర్ వలి షేక్ దాదాసాహెబ్ షేక్ మస్తాన్ వలి షేక్ మహమ్మద్ రఫీ, షేక్ ఉమర్ అలీ,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు కాటూరి కోటేశ్వరరావు పల్లె పోగు రాజు, అన్నపురెడ్డి వెంకటేశ్వర్లు ఉప్పాల బాబు కె.ఆంజనేయులు యువజన కాంగ్రెస్ నాయకులు ఇంటూరి భవాని వెంకటేష్, అన్నపురెడ్డి ఈశ్వర్,కారుచోల స్వప్న కుమార్,చిలకా నాగరాజు, మండల సేవా దళ్ అధ్యక్షుడు షేక్ ఖాజా బుడే, ఎన్ యస్ యు ఐ అధ్యక్షుడు షేక్ బాషా పార్టీ నాయకులు మిరియాల వెంకటరత్నం దాసరి శ్యాంబాబు రెడ్డెం నర్సిరెడ్డి కోడూరి రాజా, షేక్ ఖాసిం సైదు తదితరులు సంతకాలు చేశారు