Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాటం చేసిన సర్దార్ శ్రీ గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా అరవపల్లి లోని స్థానిక బచ్చు భవన్ నందు లచ్చన్న చిత్రపటానికి మాలలు వేసి పోరాటాలను స్మరించుకొని ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.అనంతరం విభా ఎరుడైట్ స్కూల్ చైర్మన్ డాక్టర్ బచ్చు జయభాస్కర్ రావు గారు లచ్చన్న విలువలతో కూడిన రాజకీయాలను నడిపి ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగిన పిదప కూడా అనేక పర్యాయములు శాసన సభ్యుడిగాను మరియు రాష్ట్ర మంత్రిగా కూడా వ్యవహరించి ప్రజా సమస్యలపై అధికారపక్షంలో ఉన్న తానే ప్రతిపక్షంగా వ్యవహరించి పోరాటాలు నడిపి ప్రజల మన్ననలు పొందిన మహనీయుడు అని కొనియాడారు.ఈ సందర్భంగా లయన్ మన్నెం రామ మోహన్ మాట్లాడుతూ.సర్దార్ గౌతు లచ్చన్న బ్రిటిష్ నిర్బంధాలకు ఎదురు తిరిగి, సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తితో వారిపై ఉద్యమించి పలుమార్లు జైలుకు వెళ్లడం జరిగింది. తదుపరి ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికవటమే కాకుండా.ఒక పర్యాయం శ్రీకాకుళం నుండి ఎంపీగాను మరియు ఎమ్మెల్యే గాను రెండింటికి ఎన్నికవ్వడం జనంలో వారికున్న ఆదరణకు తార్కాణం అని తెలియ జేశారు.దేశంలోనే వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనే గౌరవం తో పిలువబడిన ఏకైక వ్యక్తి గౌతు లచ్చన్న ని తెలియచేసారు.ఈ కార్యక్రమం లో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కుర్రా మణి యాదవ్,బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దాసరి నరసింహులు, కొత్తపల్లి రాజాచారి,గంధం గంగాధర్,బండారు రెడ్డి శేఖర్,గుండు సురేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.