

జనం న్యూస్ ఏప్రిల్ 20(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
మునగాల మండల పరిధిలోని నేడు ఆదివారం ముకుందాపురం, రేపాల ఏజీయల్, తాడువాయి, వెంకటరాంపురం, మాధవరం, మరియు ఎస్ఎన్ పేట ఫీడర్లు ట్రీ కటింగ్ ప్రోగ్రామ్ ఉన్నందున ఆయా గ్రామాలకు మరియు అగ్రికల్చర్ పరిధిలో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని శనివారం మండల విద్యుత్ శాఖ ఏఈ వికాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విద్యుత్ అంతరాయానికి విద్యుత్ వినియోగదారులను సహకరించాలని కోరారు.