

జనంన్యూస్. 20. నిజామాబాదు. ప్రతినిధి.
నిజామాబాదు. జిల్లా లో గత పది రోజుల కిందట.తేదీ 05/4/2025, న నందిపేట పోలీస్ స్టేషన్ లో, పొగరు రవి కిరణ్, R/o, అన్నారం విలేజ్, నందిపేట మండలం, ఇచ్చిన దరఖాస్తు మేరకు, నిజామాబాద్ సిపి, శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్., ఆదేశాల అనుసారం, నందిపేట్ పిఎస్ క్రైమ్ నెంబర్:85/2025, U/s: చీటింగ్ మరియు ఇమిగ్రేషన్ యాక్ట్ కింద, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయగా, అందులో ప్రధాన ముద్దాయిగా ఉన్న, 1)దోందిగల భూమేష్ @ పబ్బ భూమేష్ రెడ్డి, 2)అతని భార్య పబ్బ స్వప్న, 3) అరుగుల భోజరాం,R/o
నందిపెట్, 4) మోచరాజు, 5) బిజ్జం సుబ్బారెడ్డి (ఓనర్ ఆఫ్ శ్రీదేవి ట్రావెల్స్, నిజామాబాద్) 6) ఆరేపల్లి మహేష్, (ట్రావెల్ ఏజెన్సీ ఆర్మూర్) ల పైన కేసు నమోదు చేసి , దర్యాప్తులో భాగంగా వీరంతా ఒక కూటమిగా ఏర్పడి అమాయకపు నిరుద్యోగ యువతకు దుబాయ్ లో, మంచి కంపెనీలో ఉద్యోగాలు అని చెప్పి , మరియు మూడు కంపెనీలలో వారే జనరల్ మేనేజర్ గా , ఫైనాన్స్ మేనేజర్ , లము అంటూ చెప్పుకుంటూ వారికి వీసాలు పంపించి ఒక్కొక్కరి వద్ద నుండి 6 లక్షల రూపాయలు తీసుకొని వారికి దుబాయిలో ప్రైవేట్ కంపెనీ జాబు అనేసి, హై ప్రొఫైల్ క్రియేట్ చేసి వారి పేర్లు మీద క్రెడిట్ కార్డ్స్ మరియు పర్సనల్ లోన్స్ తీసుకొని సుమారు ఆరు నెలల తర్వాత, బాధితులకి 30 లక్షల రూపాయలు ఇచ్చి తిరిగి ఇండియాకి పంపిస్తామనేసి మాయమాటలు చెప్పి దుబాయ్ వెళ్లిన తర్వాత వారికి ఎలాంటి ప్రైవేటు ఉద్యోగం చూపించకుండా 6 నెలల తరువాత వారిని బెదిరించి , దుబాయ్ నుంచి తిరిగి ఇండియాకి పంపించేవాళ్లు, ఈ విధంగా ఈ ముఠా సభ్యులు అంతా కలిసి సుమారు 70 నుంచి 80 మంది నిరుద్యోగ యువకులను మోసం చేశారని తెలిసినది,
కావున ఇట్టి కేసుని నిజామాబాద్ సిపి శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ గారి ఆదేశాల అనుసారం,
సిసిఎస్ ఏసిపి శ్రీ నాగేంద్ర చారి గారి పర్యవేక్షణలో, నందిపేట ఎస్సై శ్రీ ఎమ్. చిరంజీవి మరియు వారి సిబ్బంది ఈనెల 12వ తారీకు, అరుగుల బోజారం (A3) , నీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించగా, మరియు ఈరోజు 19/04/2025 న , మరో ఇద్దరు ముద్దాయిలైన పబ్బ స్వప్న @ దుండిగల్ స్వప్న (A2), బిజం సుబ్బారెడ్డి ,(A5) ( శ్రీదేవి ట్రావెల్ ఏజెన్సీ , నిజామాబాదు) లను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించనైనది, మరియు పబ్బ స్వప్న పైన గతంలో జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్లో గల్ఫ్ చీటింగ్ కేసు కలవు. A1, A4, A6 లను పట్టుకోవడానికి పోలీసులు గాలీస్తున్నారు గమనిక:యువత ఎవరు కూడా నకిలీ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని , ఎవరైనా బాధితులు ఉన్నట్లయితే న్యాయ సహాయం కోసం పోలీస్ వారిని సంప్రదించాలని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ పి. సాయి చైతన్య, IPS., తెలియజేశారు. పోలీస్ PRO పోలీస్ కార్యాలయం నిజామాబాదు