Listen to this article

ముఖ్యఅతిథిగా అమీన్పూర్ మాజీ సర్పంచ్ గోకా శశికళ యాదవ రెడ్డి

జనం న్యూస్ ఏప్రిల్ 20 సంగారెడ్డి జిల్లా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 20వ వార్డు శ్రీ సాయి భగవాన్ కాలనీలో అపార్ట్మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజురెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణరెడ్డి, కోశాధికారి కోటేశ్వరరావు స్థానిక తాజా మాజీ కౌన్సిలర్ అనిరుద్ ను వివిధ అపార్ట్మెంట్ల అధ్యక్షులు తో కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసులు మాట్లాడుతూ తమ వార్డులోని అపార్ట్మెంట్ల అందరికీ వాటర్ సమస్య అధికంగా ఉండేదని ఆ సమస్యను పరిష్కరించిన వ్యక్తి మా కౌన్సిలర్ అని కొనియాడారు. ఏ సమస్య ఉన్న ఫోన్ చేసిన వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించే విధంగా చూస్తారని వారు అన్నారు .అనంతరం తాజా మాజీ కౌన్సిలర్ అనిరుద్ మాట్లాడుతూ ఈరోజు అపార్ట్మెంట్ వాసులంతా కలిసి ఈ సన్మాన సభ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని రాబోయే రోజుల్లో కూడా అపార్ట్మెంట్ వాసులకు మరియు కాలనీ వాసులకు ఎలాంటి సమస్య ఉన్న వాటిని పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అమీన్పూర్ మాజీ సర్పంచ్ గోకా శశికళ యాదవ రెడ్డి ,అపార్ట్మెంట్ అధ్యక్షులు ,జనరల్ సెక్రటరీలు, అపార్ట్మెంట్ వాసులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.