

సిఎంఆర్ ఎఫ్ చెక్కుల గోల్మాల్ లో జమ్మికుంట సప్తగిరి ఆసుపత్రి సీజ్ చేసిన అధికారులు..
జనం న్యూస్ // ఏప్రిల్ // 20 // కుమార్ యాదవ్ // జమ్మికుంట)
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజలు అనారోగ్యంతో ఆసుపత్రిల పాలై ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి రూపంలో దరఖాస్తు పెట్టుకున్న వారికి ఆర్థిక సహకారం అందిస్తుంది ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకున్న కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు రోగులకు వైద్యం చేయకుండానే ఆపరేషన్లు చేయకుండానే నకిలీ కే సీట్లు నకిలీ బిల్లులు సృష్టించి రాష్ట్రవ్యాప్తంగా సుమారు కొన్ని కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడంతో, ఇ స్కాం గతం లో వెలుగు చూసింది, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జమ్మికుంట పట్టణంలోని సప్తగిరి ఆసుపత్రిలో జరిగిన సీఎంఆర్ఎఫ్ కుంభకోణాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సిఐడి అధికారులు పలుమార్లు ఆసుపత్రి పై రైడ్ చేసి తనిఖీలు నిర్వహించారు. అనేక ఆధారాలు సాక్షాదారాలు దొరకడంతో నిజనిర్ధారణ చేసిన సిఐడి అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కు ఆధారాలతో నివేదికలు సమర్పించడంతో,, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు నాలుగు రోజుల క్రితమే జమ్మికుంట లోని సప్తగిరి ఆస్పత్రికి జిల్లా వైద్యాధికారులు నోటీసులు జారీ చేసారు. ఈ విషయాన్ని గోప్యంగా హాస్పిటల్ ఏజమాన్యం, ఉంచిది. శనివారం ఆస్పత్రి యధావిధిగా నడుస్తుండడంతో వైద్యశాఖ అధికారుల కు ఫిర్యాదులు పోవడంతో హుజురాబాద్ డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చందు, అధికారులు ప్రతాప్, రాజులు ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రికి సీజ్ చేశారు. ఈ ఆసుపత్రికతో పాటు రాష్ట్రంలోని పలు చోట్ల ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వం సీజ్ చేసింది, అనంతరం సప్తగిరి ఆసుపత్రిలో జరిగిన సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల కుంభకోణంలో ఆసుపత్రి యజమాన్యం నుండి ప్రభుత్వం తిరిగి డబ్బులు రాబట్టడానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
