Listen to this article

ప్రధానోపాధ్యాయురాలు కుమారి మేఘనకు పలువురి ప్రశంసలు..

జనం న్యూస్ // ఏప్రిల్ // 20//కుమార్ యాదవ్ // హుజురాబాద్)..

హుజురాబాద్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (హై స్కూల్) ఆవరణలోని ప్రాథమిక పాఠశాల యందు శనివారం నాడు( 5) ఐదో తరగతి విద్యార్థుల వీడ్కోల సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కుమారి శనిగరపు మేఘన ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా, మాడుగుల ఫ్రాన్సిస్ ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రిటైర్డ్ గెజిటెడ్ హెడ్మాస్టర్ వేల్పుల రత్నం, ప్రజా సంఘాల నాయకులు వేల్పుల ప్రభాకర్, స్థానిక పాత్రికేయుడు కేసరి. మధుకర్ రావు, పాఠశాల హిందీ స్కూల్ అసిస్టెంట్ మంగళపల్లి సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథి మాడుగుల ఫ్రాన్సిస్ మాట్లాడుతూ… క్రమశిక్షణ తో పాటు సక్రమమైన విద్యను విద్యార్థులు అభ్యసించాలని చక్కటి విద్యతో విద్యావంతులు కావాలని అన్నారు. ప్రధానోపాధ్యాయురాలు కుమారి మేఘన ఈ పాఠశాలలో పనిచేయడం విద్యార్థుల అదృష్టమని, అలాగే మేఘన కూడా మంచి విద్యాబోధనతో, అంకుటీత దీక్షతో నాణ్యమైన విద్యను నాలుగో తరగతి, కొత్తగా ఐదో తరగతి విద్యార్థులకు బోధించిందని ,ఇంకా విద్యాబోధన చేస్తూ, వృత్తిలో మేఘన రాణించాలని, అంచెలంచెలుగా ఆమె ఎదగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆశీర్వదించారు. మరో అతిధి అయిన రిటైర్డ్ గెజిటెడ్ హెడ్మాస్టర్ వేల్పుల రత్నం మాట్లాడుతూ… ప్రధానోపాధ్యాయురాలు అయినా కుమారి శనిగరపు మేఘన ఈ పాఠశాలలో కొత్తగా ఉద్యోగంలో చేరి ఒక కొత్త ఆలోచనతోటి ఐదవ తరగతి పిల్లలు పరీక్షలు రాసిన తర్వాత వారు మళ్ళీ ఆరో తరగతి చదవాలి కాబట్టి ఐదవ తరగతి విద్యార్థులకు పాఠశాల వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమని ప్రధానోపాధ్యాయురాలు మేఘనను కొనియాడారు. ఇంకా మేఘన సరికొత్త కార్యక్రమాలు, కొత్త విషయాలతో భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో చేయాలని పాఠశాల అభివృద్ధికి, సరైన విద్యను విద్యార్థులకు అందించడం కోసం మా యొక్క సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు మేఘన మొదటి పోస్టింగ్ హుజురాబాద్ ప్రాథమిక పాఠశాలకు కావడం చాలా సంతోషమని వేల్పుల రత్నం తెలిపారు. ఈ పాఠశాలలో 5వ తరగతి చదివిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. మరొక అతిథి స్థానిక పాత్రికేయుడు కేసరి మధుకర్ రావు మాట్లాడుతూ…. ప్రతి పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నత చదువులు కాలేజీలో చదువుకోవడానికి విద్యార్థుల ఆత్మీయ వీడ్కోల సమావేశం నిర్వహించుకుంటారని, కానీ ప్రధానోపాధ్యాయులైన కుమారి శనీగరపు మేఘన ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ప్రభుత్వ హైస్కూల్ లో మరియు గురుకుల పాఠశాలలో ఆరవ తరగతి చదువుకోవడానికి వెళ్తున్న విద్యార్థుల కోసం ఈ వీడ్కోల సమావేశం ఏర్పాటు చేయడం మంచి పరిణామం అని అన్నారు.”విద్య లేనివాడు వింత పశువు”అని విద్యార్థులు ఆరో తరగతి నుండి చాలా చక్కగా ఏకాగ్రతతో మంచి నడవడితో, క్రమశిక్షణతో బాగుగా చదువుకొని మీ తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తేవాలని అన్నారు. తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను ఎల్లప్పుడూ గౌరవించాలని అలాగే చదువుతోపాటుగా విద్యార్థులు తమకు తోచిన రంగాలలో క్రీడలు, సాహిత్యం, నృత్యం, సంగీతం, పాటలు, నటన, తోపాటు విద్య మరియు వైద్య రంగంలో ప్రతిభ కనబరచి, తమ నైపుణ్యాన్ని చాటుకోవాలని అన్నారు. పాఠశాల హిందీ సబ్జెక్ట్ స్కూల్ అసిస్టెంట్ మంగళపల్లి సంపత్ మాట్లాడుతూ…. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హుజరాబాద్ లో ఒకటో తరగతి నుండి 5వ తరగతి చదువుకొని పై తరగతి కోసం పోతున్న సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కుమారి శనిగరపు మేఘన ని, ముఖ్య అతిథులుగా వచ్చిన ఫ్రాన్సిస్ , అలాగే ఎన్నో సలహాలు సూచనలు అందిస్తున్న వేల్పుల రత్నం, అలాగే సమాజంలో జరుగుతున్న అన్ని విషయాలను ప్రజలకు చేరవేసె వార్తాపత్రిక మిత్రుడు కేసరి మధుకర్ రావుకి, అలాగే విద్యార్థినీ విద్యార్థులు పై తరగతికి పోతున్న సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం పట్ల శుభాభినందనలు తెలియజేశారు. సంపత్ మాట్లాడుతూ.. కుమారి మేఘనా మేడమ్ జిల్లా డీఎస్సీలో మొదటి ర్యాంకు తెచ్చుకొని అక్టోబర్ మాసంలో ఇదే పాఠశాలలో పోస్టింగ్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మేఘన ముందు ముందు ఎంతో మర్యాదగా, వినయంగా, సమన్వయంతో, ప్రేమానురాగాలతో ఉపాధ్యాయ వృత్తికి వన్నె తేవాలని ఆశిస్తూ అభినందించారు.
ఆ తర్వాత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలైన కుమారి మేఘన మాట్లాడుతూ…. విద్యార్థులు మంచిగా చదువుకొని ఆటపాటలతో రాణించాలని, క్రమశిక్షణతో చక్కటి చదువుతోపాటు తల్లిదండ్రులను, గురువులను పెద్దలను గౌరవించాలని, అలాగే మీ ప్రతిభను గుర్తించాలని ఆమె కోరారు. కార్యక్రమానంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేయడంతో పాటు కేక్ కట్ చేసి విద్యార్థులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.