Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 20 ముమ్మిడివరం ప్రతినిధి


అమలాపురం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘం ఆధ్వర్యంలో శనివారం రాత్రి జరిగిన కార్యవర్గ సమావేశంలో ఇటీవల రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమింపబడిన కంకటాల రామం ను సంఘ ఆధ్వర్యంలో సాలువతో సత్కరించి, పూలమాలలు వేసి కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించి శుభాకాంక్షలు తెలియజేసి అభినందనలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో సంఘ ఒక రోజు ఆపధర్మ అధ్యక్షుడు నందిపాటి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు యెoడూరి
వేంకట్రామయ్య, కార్యదర్శి నంబూరి నరేష్, కోశాధికారి కొమ్మూరి ప్రసాద్ మరియు అధిక సంఖ్యలో కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.