

పాఠశాల అభివృద్ధికి పాటుపడదాం…
మా ఆచార్యుల సేవలు మరువలేనివి…
జనం న్యూస్ // ఏప్రిల్ // 20 // కుమార్ యాదవ్// జమ్మికుంట)
జమ్మికుంట పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో 1999 – 2000 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకుని 25 సంవత్సరాల అనంతరం పాఠశాలలో కలవడం, చార్యులైనటువంటి,కనబోయిన కొమురయ్య , జూపాక రవీంద్ర చారి, పలకల రమేష్ రెడ్డి వారు ఈనాడు మన మధ్యలో లేకపోవడం మాకు ఎంతో బాధగా ఉందని, మా జీవిత ఆశయాలను అనుగుణంగా మాకు విద్యను బోధించి మమ్మల్ని ఒక స్థాయిలో ఉంచినటువంటి ఆచార్యులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తూన్నాం అన్నారు.
పాఠశాలను మరువ లేకుండా పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని పూర్వ విద్యార్థిని విద్యార్థులు పేర్కొన్నారు. అనంతరం పాఠశాలలో చదువు చెప్పిన ఆచార్లను సన్మానం చేయడం జరిగింది అన్నారు.
ఈ సమావేశంలో 40 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతీ విద్యాపీఠం జిల్లా కార్యదర్శి శ్రీ తేళ్ళ రాజమౌళి,పాఠశాల సమితి అధ్యక్షులు శ్రీ ఆవాల రాజిరెడ్డి , కార్యదర్శి శ్రీ ఆకుల రాజేందర్ , ప్రబంధకారిణి అధ్యక్షులు శ్రీ శీలం ఆక్టివిటీస్ , కార్యదర్శి శ్రీ దాసరి రవీందర్, పూర్వ ఆచార్యులు శ్రీ బుర్ర శివయ్య , శ్రీ చెరుకు సోమయ్య, శ్రీ డింగరి రవికుమార్, శ్రీ అకినపల్లి వీరప్రసాద్ , శ్రీనివాస్, దూడం సాంబయ్య , చందుపట్ల నాగయ్య వెంకటేశ్వర్లు, పాఠశాల ప్రధానాచార్యులు శ్రీ గుడికందుల సుదర్శన్ , పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
