Listen to this article

ఇ నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి..


కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వోడితల ప్రణవ్ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి.

.
నిరుపేద కుటుంబానికి చెందిన గుండేటి సరిత.. పెద్ద పాపయ్య పల్లి..

జనం న్యూస్ // ఏప్రిల్ //21 // కుమార్ యాదవ్ // జమ్మికుంట)..

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని పెద్ద పాపయ్య పల్లి గ్రామానికి చెందిన గుండేటి సరిత-శివ ఇంటి కప్పు ఇటీవల “‘అకాల గాలి వాన బీభత్సవానికి “” ఆ ఊరిలోని నిరుపేద కుటుంబానికి చెందిన గుండేటి సరిత -శివ ఇంటి పై కప్పు రేకులు మొత్తం పగిలి పోవడతో పాటు కూలి పోయాయి.ఆ నీరు పేద కుటుంబం రోడ్డున పడాల్సి వచ్చింది. వారు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. కనీసం ఉండానికి నీడ కూడా లేని పరిస్థితి లో ఉన్న సరితా ఈ సందర్బంగా మాట్లాడుతూ.. మాది చాలా నిరుపేద కుటుంబం అని మాకు ఇందిరమ్మ ఇల్లు, ఇపించ గలరని, , హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడితల ప్రణవ్ ని వేడుకుంటున్నాం అని తెలిపారు. నా పరిస్థితి చూసి తప్పకుండ సహాయం చేస్తారు అన్నారు. ప్రణవ్ బాబు చొరవ తీసుకొని ప్రభుత్వం తరఫున ఈ నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, సమాకూర్చే ల సహకరిస్తారని, సరిత వేడుకుంటున్న అని మాట్లాడారు.