Listen to this article

జనం న్యూస్. ఏప్రిల్ 20. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)

హత్నూర మండల పరిధిలోని కాసాల, కొన్యాల, రెడ్డి ఖానాపూర్, రెడ్డిపాలెం,హత్నూర, దౌల్తాబాద్, తదితర గ్రామాలలో ఘనంగా ఈస్టర్ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాసాల గురువులు రెవరెండ్ కాంతారావు, కొన్యాల గురువులు రెవరెండ్ అమృతయ్యలు వాక్యోపదేశం చేశారు. ఉదయాన్నే స్త్రీలందరూ తెల్లటి నూతన వస్త్రములు ధరించి కాగడాలు చేత పట్టుకొని ఏసుక్రీస్తుకు జయం కలుగును గాక జయం జయం హల్లెలూయ అంటూ పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆలయాల ముంగట ఏర్పాటు చేసిన సిలువ వెలుగు కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు. ఏసుక్రీస్తు 33½ సంవత్సరాలు ఈ లోకంలో అనేక బోధనలు చేసి నీనా పాపముల నిమిత్తం సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి మూడవ దినమున పునరుత్థానుడై లేచాడని అన్నారు. ఈ కార్యక్రమంలో పాస్తారేట్ కమిటీ మెంబర్స్ నాయికోటి ప్రభాకర్,పాముల భాస్కర్,పాముల సాగర్,మదువ సామెల్,నీరుడి రమేష్, సంఘం పెద్దలు.గుడెపు భాస్కర్, శంకరయ్య,లక్ష్మయ్య యాదగిరి, నాయికోటి సుధాకర్, సాకలి ప్రభాకర్, గంగయ్య, పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.