Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం


అంబులెన్స్ సిబ్బందికి రూమ్ వసతి కల్పించాలి శాయంపేట ఎంపీడీవో ఆఫీసు సూపరిండెంట్ బి, సులోచనకు వినతి పత్రం అందజేసిన అనంతరం శాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా హనుమకొండ జిల్లా కార్యదర్శి వంగర సాంబయ్య మాట్లాడుతూ.మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య సెంటర్ పరిధిలో గత కొన్ని నెలల నుండి అంబులెన్స్ ఉంటుంనదని అంబులెన్స్ డ్రైవర్ ఆరోగ్య సహాయకులు ఇద్దరు ఉంటున్నట్లు తెలిపారు ఎండలో ఉంటూ మలమూత్రాలకు స్నానాలకు విశ్రాంతి భోజనానికి అనేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు తక్షణమే పరిశీలించి వారికి విశ్రాంతి వసతి రూము ఏర్పాటు చేయి చేయాలని కోరినారు ఈ కార్యక్రమంలో ఆడేపు అశోక్ తదితరులు పాల్గొన్నారు….