Listen to this article

జనం న్యూస్;21 ఏప్రిల్ సోమవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ ;

నీతి, న్యాయం, ధర్మంతో కూడిన రచనలు చరిత్రలో నిలిచిపోతాయని అందుకు తార్కాణం హవేళి ఘణపూర్ అమృత గుళికలు నిదర్శనమని జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ రాధాకిషన్ అన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళి ఘనపూర్ నందు బడి పిల్లలు రాసిన హవేళి ఘణపూర్ అమృత గుళికలు పుస్తకావిష్కరణ చేసి మాట్లాడుతూ బాల్యం నుంచే విద్యార్థులు బాధ్యతాయుతమైన రచనలు చేసినప్పుడు సమాజంలో మార్పు తీసుకురావచ్చని, అందుకు కృషి చేస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరుణాకర్, పుస్తక సంపాదకులు ఉండ్రాళ్ళ రాజేశంలను అభినందించారు. సాహిత్య సృజన కలిగిన విద్యార్థులు భవిష్యత్ లో ఏ రంగంలో ఉన్న సమాజ సేవ చేస్తారన్నారు. ఏఎంఓ సుదర్శన మూర్తి మాట్లాడుతూ పుస్తకాలు చదవాల్సిన సమయంలో విజ్ఞానం పొంది పుస్తక రచనలు చేయడం సంతోషమన్నారు. ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ మాట్లాడుతూ పాఠశాల ఉపాధ్యాయుల కృషి ఫలితంగా బాలసభ ఏర్పాటు చేసి విద్యార్థుల సృజనకు పట్టం కట్టేలా ఈపుస్తకం దోహదపడుతుందన్నారు. ఎంఇఓ మధుమోహన్ మాట్లాడుతూ హవేళి ఘనపూర్ విద్యార్థులు అన్ని రంగాలతో పాటుగా సాహిత్య కృషి చేయడం అభినందనీయమన్నారు. పుస్తక సమీక్షకులు వరుకోలు లక్ష్మయ్య కవిత, కథ, గేయం, పాటలతో పుస్తక విశేషాలు తెలిపి మంత్రముగ్దులను చేశారు. ఏఎంసి చైర్మన్ స్వాతి ఉపాధ్యాయులు రాజశేఖర్, శ్యామల, రవీందర్, దెవులా, మహేశ్వరచారి, నల్ల అశోక్, ఎల్లమ్మ, రమేష్, మధుసూదన్, వెంకటేష్ తల్లిదండ్రులు, పోషకులు తదితరులు పాల్గొన్నారు.