

జనం న్యూస్, ఏప్రిల్ 21 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
తేదీ 20/04/2025 న వేదిక: గురునానక్ దేవ్ యూనివర్సిటీ అమృత్, పంజాబ్ నందు అంతర్జాతీయంగా రెండవ అతిపెద్ద అవార్డ్స్ సంస్థ అయినా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ అవార్డ్స్ నిర్వహించిన పోటీల్లో 12 దేశాలకు చెందిన అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులు పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమంలో ,సిద్దిపేట జిల్లా దామరకుంట ఉన్నత పాఠశాల , మర్కూక్ మండలానికి చెందిన 9వ తరగతి చదువుతున్న మా జూనియర్ సునీత,విలియమ్స్ గా పిలవబడే లింగా వైష్ణవి,,తన మెంటార్ అయిన శ్రీ వై చిన్న బ్రహ్మయ్య భౌతిక శాస్త్రం ఉపాధ్యాయులు, మార్గదర్శకత్వంలో ప్రదర్శకులందరిని అబ్బురపరిచేలాగ అత్యంత వేగంగా,,కేవలం 1 నిమిషం 59 సెకండ్స్ లోనే రసాయన శాస్త్రంలోని నూతన ఆవర్తన పట్టిక క్రమాంకములో ఏర్పాటు చేసి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ అవార్డ్స్ లో స్థానం సొంతం చేసుకున్న విద్యార్థిని.
ఈ అవార్డు ను ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ అవార్డ్స్ సీఈఓ, పంకజ్ వేగ్ చేతుల మీదుగా ట్రోపీను, బహుమతిని పొందటం జరిగింది. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో వ్యయ ప్రయాసాలను గుర్తించిన సహృదయరాలు , సేవయే మార్గం గా ముందుకు సాగుతున్న శ్రీమతి ముదిగొండ మణిమాల విశ్వ ప్రసాద్ ఎస్ . ఎ తెలుగు ఉపాధ్యాయుని, దామరకుంట రూపాయలు, 15000 లు అందించి ప్రోత్సహించినందులకు కృతజ్ఞతలు. ఈ సందర్భంగా అభినందనలు మరియు మంచి భవిష్యత్తు ఉండాలని తెలియపరచిన మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాధికారి అయినా ఏ,వెంకట రాములు మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థి వైష్ణవి కి మరియు గైడ్ టీచర్ శ్రీ చిన్న బ్రాహ్మయ్య,కి అభినందనలు తెలియజేసారు

