Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 21 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

అధికార, ప్రతిపక్ష పార్టీలు స్పందించకపోవడం హాస్యాస్పదంగా ఉంది. మల్లెల శివ నాగేశ్వరావు పట్టణంలోని ఎల్ఐసి బిల్డింగ్, ట్రెండ్స్ బిల్డింగ్ ల మధ్యన డాక్టర్ కొమ్మినేని వీర శంకర్రావు కోసం ప్రజలకు ఎవ్వరికి ఉపయోగం లేని ప్రాంతం లో సుమారు రూ. 13 లక్షలతో సిమెంటు రోడ్డు వేయడం పై పుర ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఈ విధంగా ప్రజల ధనాన్ని రాజకీయ నాయకుల మాటలు విని మున్సిపల్ అధికారులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా అనే ప్రశ్నలు ఉత్పనమవుతున్నాయి. కాంట్రాక్టర్ పోపూరి వెంకటరమణ టెండర్ ద్వారా సిమెంట్ రోడ్డు పనుల అనుమతి పొంది బినామీ కాంట్రాక్టర్ ఉప్పలపాటి వెంకటేశ్వరావు ద్వారా సిమెంట్ రోడ్డు పనులు చేశారు.దీనికి సంబందించిన బిల్లు తీసుకోబోతున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై అధికారపక్ష నాయకులు గానీ ప్రతిపక్ష నాయకులు గానీ ఇప్పటివరకు స్పందించకపోవడం హాస్యస్పదంగా ఉంది. ఇప్పటికైనా రాజకీయ నాయకులందరు.ఈ విషయంపై స్పందించాలని పుర ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై సమాచార హక్కు చట్ట ప్రకారం సమాచారం కోరిన మున్సిపల్ శాఖ అధికారులు స్పందించలేదని కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరావు అన్నారు. దీనిపై అధికార, ప్రతిపక్ష నాయకులు ఏ విధంగా స్పందిస్తారో అనేది వేచి చూడాల్సి ఉంది.