Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 21:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం :

ట్విన్నింగ్ అఫ్ స్కూల్ అనగా పాఠశాల విద్యను బలోపేతం చేయడం నాణ్యమైన విద్యను అందిచడమే లక్ష్యం గా సోమవారం రోజునా దోoచందా ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు ఏర్గట్ల ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఆ పాఠశాలలోని గ్రంథాలయాన్ని, సైన్స్ ల్యాబ్ ను, తరగతి గదులను, ప్యానల్ బోర్డులను చూడడం జరిగింది. గ్రంథాలయంలో ఉన్న కథల పుస్తకాలను తీసుకొని విద్యార్థులు చదవడం, ఆటల పరికరాలతో చక్కగా ఆడుకోవడం, ఫ్యానల్ బోర్డులో అనేక విషయాలను విద్యార్థులు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలను సందర్శించిన విద్యార్థులకు పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి పరీక్ష అట్టలను వితరణ చేశారు.ప్రధానోపాధ్యాయులు విద్యార్థులతో మాట్లాడుతూ చక్కగా చదువుకొని మంచి స్థాయిలో ఉండాలని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో దోoచందా ఉపాధ్యాయులు శ్రీనివాస్ సంగీత, ఏర్గట్ల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.