

జనం న్యూస్. ఏప్రిల్ 20. మెదక్ జిల్లా. శివంపేట్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)
మెదక్ జిల్లా శివంపేట మండలంలోని 9 తోమ్మిది గ్రామాలకు వెళ్లే చెరువు కట్ట రోడ్డును రెండు లక్షల రూపాయలు తన సొంత నిధులతో మరమ్మతు చేయించిన మెదక్ జిల్లా తాజా మాజీ జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా. శివంపేట మండల కేంద్రం నుండి పిలుట్ల,రత్నాపూర్,కొత్తపేట్, లింగోజిగూడ,అల్లీపూర్,తాళ్లపల్లి గడ్డ,నాను తండా,బిఖ్య తండా,రెడ్యా తండాలకు వెళ్లాలంటే పెద్ద చెరువు కట్ట మీది నుండి వెళ్లాల్సిందే. ఒక కిలోమీటర్ వరకు ఈ చెరువు కట్ట పూర్తిగా ధ్వంసమై గుంతల మయంగా మారి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తరచూ వాహనదారులు ప్రజలు గాయాల పాలై మంచాన బారిన పడుతున్నారని. విషయం తెలుసుకొని చలించిపోయిన మాజీ జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా రెండు లక్షల రూపాయలు తన సొంత నిధులతో, ట్రాక్టర్ల ద్వారా కంకర డస్ట్, తెప్పించి రోడ్డును మరమ్మత్తు చేయించడంతో ఆయా గ్రామాల ప్రజలు రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ పబ్బ మహేష్ గుప్తకు ఘనంగా సన్మానించారు..ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు మాట్లాడు రోడంతా గుంతల మయంగా మారి తరచూ ప్రమాదాలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేట న్నారు.తన సొంత నిధులతో చెరువు కట్ట రోడ్డును మరమ్మతు చేయించినందుకు ప్రజలు పబ్బ మహేష్ గుప్తకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో. మండల నాయకులు. వివిధ గ్రామాల ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

