

బిచ్కుంద ఏప్రిల్ 21 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం కేంద్రంలో జుక్కల్ శాసన సభ్యులు తోట లక్ష్మి కాంతరావు ఆదేశాల మేరకు సోమవారం రోజు బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ కమిటీలో మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి ,సింగిల్ విండో చైర్మన్ బాలు తో కలిసి జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆమె మాట్లాడుతూ రైతులు తాము పండించిన జొన్నలను దళారులకు అమ్మ కుండ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు చేసే కేంద్రాలలోనే అమ్మి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ యాదవ్ రావ్ సొసైటీ డైరెక్టర్ సంజు ,చంద్రకాంత్ పటేల్, రాజు సొసైటీ సి ఓ శ్రావణ్ కుమార్ మరియు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు