

ఆదివాసీ ములుగుజిల్లా కన్వీనర్ పర్సిక సతీష్
ఏప్రిల్ 21 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు
ములుగుజిల్లాఆదివాసిసంక్షేమపరిషత్(రి.నెం.1483/2017) తెలంగాణ రాష్ట్ర శాఖ మరియు రాష్ట్ర అధ్యక్షులు పూనెం శ్రీనివాస్ గారి ఆదేశాలతో 5 మే 2025 న షెడ్యూల్ ప్రాంత భూమి చట్టాలు, నిబంధనలు, హక్కులు అమలు కొరకు ములుగు జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయటానికి ములుగు జిల్లా కన్వీనర్ గా పర్శిక సతీష్, కో కన్వీనర్ గా టింగ భుచ్చయ్య, కుర్సం శివశంకర్,తాటి రామచందర్, పాయం భారతి ను ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పూనెం శ్రీనివాస్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఐదవ షెడ్యూల్ భూభాగంలో నివాసం ఉంటున్న ఆదివాసులు ఏజెన్సీ ప్రాంతాలల్లో ప్రవేశించిన గిరిజనేతరులు మరియు1970 సంవత్సర తర్వాత వలస వచ్చిన గిరిజనేతరుల కారణంగా ఎన్నో ఏళ్లుగా ఆదివాసులు దోపిడీకి, అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాలకు వర్తింపజేసిన న్యాయ పాలన, రెవిన్యూ పద్ధతులు చట్టాలు, నిబంధనలు, హక్కులు, భూస్వాధీనానికి అక్రమ మార్గాలకు అడ్డుకట్ట వేయలేక పోయారని మండిపడ్డారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులు రాను రాను ఆర్థిక పరిస్థితి దిగజారిపోతూ ఉంటే గిరిజనేతరులు పై పైకి ఆర్థికంగా, రాజకీయంగా ఎగబాకుతూ తమ ఆధిపత్యాన్ని పెంచి పోషించుకుంటూ ఉన్నారని ధ్వజమెత్తారు. గిరిజనుల భూమిపై వారికున్న సహజ హక్క నిర్వీర్యం కాకూడదనే ఉద్దేశంతోనే బ్రిటిష్ హయంలో నుండి చట్టాల రూపకల్పన జరిగిందన్నారు. ఆదివాసి చట్టాలు, హక్కులు అమల కొరకు 5 మే 2025 న ములుగు జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు