

జనం న్యూస్ ఏప్రిల్ 22 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి ప్రారంభించారు చిలిపి చెడు చండూరు చిట్కుల్ గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ప్రారంభించారు ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు రైతులు పండించిన ధాన్యాన్ని దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి అని తెలియజేశారు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో అమ్ముకుంటే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర వస్తుందన్నారు దళారుల చేతిలో రైతులు మోసపోవద్దని సూచించారు ప్రభుత్వం ఒక క్వింటాల్ ఏ గ్రేడ్ ధాన్యానికి 23 20 రూపాయలు ప్రకటించిందని తెలిపారులకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు గోనె సంచులు సుతిల్ తాళ్లు త్రాగునీరు అందించాల్సిన బాధ్యత అధికారులకు ఉందన్నారు అదేవిధంగా రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్రాన్స్పోర్ట్ గానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు అధికారులు కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని రైస్ మిల్ కు తరలించడానికి వెంటనే రైస్ మిల్లర్లకు అలాట్మెంట్ ప్రకటించాలని రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణమే ఆ రైస్ మిల్లర్లకు తరలించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు పోయినసారి రైతుల నుండి సన్న వడ్లను కొనుగోలు చేయడంలో ఆలస్యం చేయడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు ఈసారి అలాంటి సంఘటనలు జరగకుండా వెంటనే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు సీఎంఆర్ఎఫ్ చండూరు గ్రామానికి సంబంధించిన చెక్కులు లబ్ధిదారులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎం ఆర్ ఓ సింధుజ ఆర్ ఐ సునీల్ చౌహాన్ ఎంపీడీవో ఆనంద్ ఏపీఎం ప్రేమలత మండల అధ్యక్షులు సుధారాణి రేణుక డ్వాక్రా మహిళలు మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ గౌడ్ కృష్ణవేణి దివ్యశ్రీ మాజీ మెదక్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్ర గౌడ్ బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అశోక్ రెడ్డి ధర్మారెడ్డి దుర్గారెడ్డి శ్రీకాంత్ రెడ్డి రాజేందర్ రెడ్డి ముకుందా రెడ్డి కిషన్ రెడ్డి హనుమంతు గోపాల్ రెడ్డి వీరస్వామి నరేందర్ రెడ్డి రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు