

జనం న్యూస్ ఏప్రిల్ 22 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల
కేంద్రంలోని ఎస్ వి కే కే ఫంక్షన్ హాల్ యందు భారతీయ జనతా పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జయంతి వారోత్సవాలు జరుపుతూ మాజీ ప్రధానమంత్రి అటల్ బీహార్ వాజ్పేయి శతజయంతి ఉత్సవాలను వక్స్ బోర్డు కు సంబంధించిన అంశాలపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు,మాజీ శాసనసభ్యులు కొండేటి శ్రీధర్, మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్, రాష్ట్ర అధికార ప్రతినిధులు చందుపట్ల కీర్తిరెడ్డి,వెంకట్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ 75 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆ పార్టీ ఎత్తుకున్న నినాదం గరీహటావో అది ఇప్పటికి నెరవేరలేదు ఈ దేశంలో అంబేద్కర్ మా పార్టీ వాడు అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కు ఏమీ గుర్తింపు ఇవ్వకపోగా ఆయనను చాలా సందర్భాల్లో అవమానపరిచారని ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తే మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దగ్గరుండి ప్రచారంలో పాల్గొని ఆయనను ఓడగోట్టారని ఆ సందర్భంలో అంబేద్కర్ను అక్కున చేర్చుకున్న జనసంఘ్ ఆయనకు మద్దతు తెలుపుతూ రాజ్యసభకు పంపిందని బిజెపి అధికారంలోకి వచ్చాకే డాక్టర్ అంబేద్కర్ కి భారతరత్న ఇవ్వడం జరిగింది . పార్లమెంట్ హాల్లో ఆయన చిత్రపటం పెట్టడానికి కూడా మనసు ఒప్పని కాంగ్రెస్ ఆయనకు ఏదో చేసిందని దేశంలో జై భీమ్ జై బాబు జై సం విధానాన్ని చెప్తూ బ్యానర్లు పట్టుకుని ఏదో కపట పాదయాత్రలు చేస్తున్నదని అదేవిధంగా అటల్ బీహార్ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎంతో ఉన్నత విలువలైన రాజకీయాలు నడిపిస్తూనే ఈ దేశ అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడ్డాడని రవాణా వ్యవస్థ బాగుపడితేనే దేశం బాగుపడుతుందని ముందే అంచనా వేసిన అటల్ బీహార్ వాజ్పేయి స్వర్ణ చతుర్భుజి అనే పథకం ద్వారా దేశంలో అన్ని రాష్ట్రాలకు ప్రధాన రహదారులను అనుసంధానం చేసే విధంగా రోడ్ల నిర్మాణం చేపట్టారని పోక్రాన్ పరీక్షలు చేపట్టి ప్రపంచ దేశాలకు భారతీయ సత్తా చాటి చెప్పారని అదేవిధంగా వక్ఫ్ బోర్డు ద్వారా ఈ దేశంలోనే ముస్లిం పేదలకు ఏం న్యాయం జరిగిందని అందులోని కొన్ని వర్గ ప్రజలే వక్ఫ్ ద్వారా లబ్ధి పొందుతున్నారు తప్ప వక్స్ బోర్డు ఆధీనంలో కొన్ని లక్షల ఎకరాల భూమి ఉంది అని ఆ భూముల ద్వారా పేద ముస్లిం సోదరులకు అబోర్డు ఏమి చేసిందని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డి, వెన్నంపల్లి పాపయ్య,చదువు రామచంద్రరెడ్డి, పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు, అసెంబ్లీ కన్వీనర్ మోర్ రవీందర్ రెడ్డి ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు బట్టు రవి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాయరాకుల మొగిలి జిల్లా యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటికొండ రవికిరణ్ కిసాన్ మోర్చా అధ్యక్షులు పోల్సనీ తిరుపతిరావు, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు పులియాల రాజు, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు సయ్యద్ సర్వర్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు జగ్గయ్య యువ మోర్చా జిల్లా అధ్యక్షులు సయ్యద్ గాలిఫ్,అధ్యక్షులు మండల అధ్యక్షులు నరహరిశెట్టి రామకృష్ణ, జిల్లా కౌన్సిల్ మెంబర్ కానుగుల నాగరాజు, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పు రాజు, యువ మోర్చా జిల్లా కార్యదర్శి లడే శివ, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు గాదె రమాదేవి,దళిత మోర్చా మండల అధ్యక్షుడు మంద సురేష్, మండల ప్రధాన కార్యదర్శి మామిడి విజయ్, గంగుల రమణారెడ్డి, వనం దేవరాజు, మోత్కూరి సత్యనారాయణ, ఎర్ర రాకేష్ రెడ్డి కడారి చంద్రమౌళి, బాసాని నవీన్, బత్తుల రాజేష్, మేకల సుమన్, కోమటి రాజశేఖర్, పున్నం సాంబయ్య, కన్నెబోయిన రమేష్, ముల్కనూరి వెంకటేష్, మంద మధు, చెక్క దినేష్, మునుకుంట్ల చంద్రమౌళి, మూడేడ్ల పైడి, పరుష బోయిన శంకర్, లావుడియా జగన్ నాయక్, కృష్ణ, వైనాల వీరస్వామి, సీతారాం రెడ్డి,వంగరి వంశీ, గాదె సుధాకర్, ఎర్ర తిరుపతిరెడ్డి, బొంకూరి శివ,జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు….