Listen to this article

భూ భారతితో రైతుల భూ సమస్యలకు సత్వర పరిష్కారం :

జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి,ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి,

జనం న్యూస్,ఏప్రిల్ 22,కంగ్టి

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ దేవి ఫంక్షన్ హాల్ లో భూభారతి అవగాహన సదస్సును మంగళవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్టోళ్ళ సంజీవరెడ్డి,తో కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న భూ భారతి పోర్టల్ చట్టాన్ని రైతు సహోదరులకు అవగాహన కల్పించారు. భూ భారతితో రైతుల భూ సమస్యలకు సత్వరమే పరిష్కారం లభిస్తుందని,రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఆర్ఓఆర్ – 2025 చట్టంతో ఎంతోమంది రైతులకు మేలు చేకూరనుందని అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఎన్నోఏళ్లుగా భూ సమస్యల పరిష్కారానికై, అధికారుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ డబ్బులు, సమయాన్ని వృధా చేసుకోవడమే తప్ప సమస్యల పరిష్కారం కాక రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రస్తుతం భూ భారతి చట్టం ద్వారా రైతులకు చేకూరే ప్రయోజనాలను కలెక్టర్ ఒక్కో అంశంపై దృశ్య రూపకంగా వివరించారు.భూ సమస్యలు కలిగిన రైతులు చట్టం అమల్లోకి వచ్చిన ఏడాది కాలంలోపు భూభారతి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.భూ భారతి చట్టం ప్రకారం భూ సంబంధిత సమస్యను బట్టి తహశీల్దార్,రెవెన్యూ డివిజన్ అధికారి రెండు అంచెలలో వ్యవస్థతో నిర్దిష్ట గడువులోపు పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.సమస్య పరిష్కారం కాకుంటే కొత్తగా ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని పేర్కొన్నారు. అనంతరం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని, పరిష్కారాని కై భూభారతి పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయం సరైంది కాదని భావిస్తే కలెక్టర్ వద్ద,కలెక్టర్ నిర్ణయం పై అభ్యంతరం ఉంటే ల్యాండ్ ట్రిబ్యునల్ కు అప్పీల్ చేసుకోవచ్చని అన్నారు. గ్రామంలో రెవెన్యూ రికార్డులు తయారు చేసి,ప్రతి సంవత్సరం డిజిటల్ రూపంలో పొందుతారన్నారు.ప్రతి గ్రామానికి విలేజ్ లెవెల్ ఆఫీసర్లను నియమించనున్నట్లు, మనిషికి ఆధార్ లాగే ప్రతి రైతుకు భూధార్ కార్డు ఇవ్వడంతో పాటు రైతుకు సంబంధించిన వ్యవసాయ భూమికి నక్ష రూపంలో పట్టాదార్ పాస్ పుస్తకం జారీ చేయనున్నట్లు తెలిపారు.పెండింగ్ లో ఉన్న సాదా బైనామా పరిష్కారం కోసం భూ భారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు. వీటికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు వెలువడనున్నాయని అన్నారు.భూ భారతి పోర్టల్ తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చింది.భూ భారతి చట్టంతో పాటు భూ భారతి పోర్టల్ కూడా ప్రారంభమైంది. భూముల నిర్వహణతో పాటు రిజిస్ట్రేషన్ల వంటి అంశాలన్నీ కూడా భూ భారతి పోర్టల్ ఆధారంగానే జరగనున్నాయి.ఏప్రిల్ 14వ తేదీ నుంచి భూ భారతి సేవలు అందుబాటులోకి వచ్చిందని అన్నారు. కొత్తగా వచ్చిన ఈ పోర్టల్ లో లావాదేవీ సేవలతో పాటు, సమాచార సేవలు ఉన్నాయి.లావాదేవీల విభాగంలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్,ఆర్ఓఆర్ కరెక్షన్,నాలా,అప్పీల్, భూముల వివరాలతో పాటు ఇతర సేవలు అందుబాటులో ఉన్నాయి అన్నారు. ఇక సమాచార సేవల్లో చూస్తే భూముల వివరాలు,భూముల మార్కెట్ విలువ, నిషేధిత భూములు,ఈ చలాన్ అప్లికేషన్ స్టేటస్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వివరాలను తెలుసుకునే సేవలు అందుబాటులో ఉండేలా రూపకల్పన చేశారని అన్నారు. భూముల వివరాలు ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.. భూ వివరాలను ఇలా చెక్ చేసుకోండి: భూమి వివరాలు తెలుసుకునేందుకు ముందుగా భూ భారతి అధికారిక పోర్టల్ లోకి వెళ్లాలి.హోం పేజీలో కనిపించే సమాచార సేవల్లోకి వెళ్లాలి.ఇక్కడ భూ వివరాలు అనే ఆప్షన్ ఉంటుంది. భూ వివరాల ఆప్షన్ పై క్లిక్ చేస్తే మరో పేజీ ఓపెన్ అవుతుంది.
ఇక్కడ సర్వే నెంబర్ లేదా పట్టాదారు పాస్ ఆధారంగా మీ భూమి వివరాలను తెలుసుకోవచ్చు.
సర్వే నెంబర్ తో చూసుకోవాలనుకుంటే జిల్లా,మండలం,గ్రామం ఎంచుకోని చెక్ చేసుకోవచ్చు.
పట్టాదారుపాస్ పుస్తకంతో అయితే కేవలం పాస్ పుస్తకం నెంబర్ తో పాటు కింద ఉండే కోడ్ ను ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. ప్రింట్ ద్వారా భూ వివరాల కాపీని పొందవచ్చు. ఈ లింక్ పై క్లిక్ చేసి భూ వివరాలను నేరుగా తెలుసుకోవచ్చు అని అన్నారు.ఇక భూ భారతి చట్టం ప్రకారం భూమి యజమాని రూ. 300 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేస్తే పట్టాదారు పాసుపుస్తకం జారీ అవుతుంది. మ్యూటేషన్ దరఖాస్తు కోసం ఎకరానికి రూ. 2500 చెల్లించాల్సి ఉంటుంది.ఈ లెక్క ప్రకారం గుంటకు రూ. 62.50 ఛార్జీ పడుతుంది.భూ హక్కులతో పాటు అధికారుల సమర్పించిన రికార్డుల్లో ఏమైనా తప్పులు ఉంటే అప్పీల్ కు వెళ్లొచ్చు. ఇందుకోసం రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. భూ యజమాని రికార్డుల్లో తప్పుల సవరణ దరఖాస్తు కోసం రూ. 1000 చెల్లించాలి. స్లాట్ బుకింగ్ ద్వారానే భూ భారతి పోర్టల్ లోనూ రిజిస్ట్రేషన్లు అవుతాయి.అనుకున్న సమయానికి కాకపోతే మార్పులు చేసుకునే వీలు ఉంటుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు అధికారి శ్రీమతి ఆర్ డి మాధురి, నారాయణఖేడ్ డివిజన్ అధికారి అశోక్ చక్రవర్తి, ఏడిఏ నూతన్ కుమార్, డిఎల్పిఓ సంజీవరావు, తహశీల్దార్ సి భాస్కర్, ఎంపీడీవో సత్తయ్య, మండల వ్యవసాయ అధికారి హరీష్ పవర్, వ్యవసాయ విస్తీర్ణం అధికారులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.