

జనం న్యూస్, ఏప్రిల్ 23, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
ఏప్రిల్ 24 లోపు మండల & జిల్లా స్థాయిలో రిసోర్స్ పర్సన్ గా పని చేయుటకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యా శాఖ అధికారి డి.మాధవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దపెల్లి జిల్లాలో మండల స్థాయి జిల్లా స్థాయిలో రిసోర్స్ పర్సన్స్ గా పని చేయుటకు అర్హత గల ఉపాధ్యాయ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, అర్హత ఆసక్తిగల గెట్ ప్రధానోపాధ్యాయులు , ప్రిన్సిపాల్, టిజిటి, పిజిటి లు, స్కూల్ అసిస్టెంట్ , ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్లు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు ఏప్రిల్ 24 సాయంత్రం 5:00 లోగా దరఖాస్తులను తగిన సర్టిఫికెట్స్, రిసోర్స్ పర్సన్స్గా చేసిన సర్టిఫికెట్ ఇతర యాక్టివిటీ సర్టిఫికెట్స్ జతపరిచి విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందించాలని తెలిపారు. అభ్యర్థులను జిల్లా స్థాయి కమిటీ ఇంటర్వ్యూ డెమో సెషన్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందని, ఇతర వివరాలకు సమగ్ర శిక్ష జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ డాక్టర్ పిఎం షేక్ ను సంప్రదించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.