Listen to this article

రామభక్తిని చాటుకున్న రామకోటి రామరాజు దంపతులు అభినందనీయం

500 సంవత్సరాల చరిత్ర కల్యానానికి తలంబ్రాలు అందించే కృషి అమోఘం

ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డిసి మాజీ చైర్మన్ బూర్గుపల్లి ప్రతాపరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి

జనం న్యూస్, ఏప్రిల్ 23( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ )

గజ్వేల్ లోని జరిగే సీతారామ, ఉమామహేశ్వరుల కల్యానానికి భద్రాచలం ముత్యాల తలంబ్రాలు 10కిలోలు మరియు గోటి తలంబ్రాలు అందించి రామభక్తిని చాటుకున్నారని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు గారని అభినందించారు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డిసి మాజీ చైర్మన్ బూర్గుపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి అన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ భద్రాచల సీతారాముల కళ్యానానికి 250కిలోల గోటి తలంబ్రాలు అందించి, కళ్యాణంతరం తిరిగి 100కిలోల ముత్యాల తలంబ్రాలు తీసుకొచ్చిన ఘనత రామకోటి రామరాజు భక్తికి నిదర్శనం అన్నారు. 500 సంవత్సరాల చరిత్ర కలిగిన గజ్వేల్ లోని సీతారామ ఉమామహేశ్వర కల్యానానికి ఒక చరిత్ర ఉంది. అది శ్రీరామనవమి రోజు భద్రాచలంలో కళ్యాణం ఐన తర్వాత 15రోజులకు ఇక్కడ జరుగును. ఎందుకంటే అప్పటి పూర్వికులు భద్రాచలం వెళ్లి కళ్యాణం తిలకించి ఆ కల్యాణ ముత్యాల తలంబ్రాలు తీసుకొచ్చి వాటితో కళ్యాణం చేసే వారని. ఆ పూర్వికుల తీసుకొచ్చే ఇచ్చే భద్రాచల ముత్యాల తలంబ్రాలను నేడు రామకోటి రామరాజు దంపతులు ఆ కథను చరిత్తార్థం చేశారన్నారు. 10కిలోల ముత్యాల తలంబ్రాలు, వేలాది భక్తులచే ఓలిచిన గోటి తలంబ్రాలు అందించి చరిత్రను సువర్ణక్షరాలతో ఖించారన్నారు. భద్రాచల దేవస్థానం మరో భక్త రామదాసుగా కీర్తించడం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం అన్నారు. ముత్యాల తలంబ్రాలను ఆలయం కమిటీ వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక సమరసత రాష్ట్ర అధ్యక్షులు ఆకుల నరేషబాబు, అధ్యక్షులు కాల్వ శ్రీధర్ రావు, రెబల్లి జితేందర్, ఏన్సీ శ్రీను, కల్యాంకర్ నర్సింగారావు, బొగ్గుల సురేష్, హరిణి మేడం, మెతుకు నర్సింలు, రవి తదితరులు పాల్గొన్నారు.