Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 22 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)


ఉప్పలగుప్తం స్థానిక శాంతి స్కూల్ లో ఈరోజు ఉదయం జరిగిన మాతృమాత మాతృభూమి మాతృభాష అనే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మరియు సమావేశానికి అధ్యక్షులుగా శివానిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ,
వరల్డ్ రికార్డ్ హోల్డర్, ఇంటర్నేషనల్ యూత్ ఐకాన్ అవార్డు గ్రహీత డా.సాంబ శివ రావు గారు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ – గర్భగుడిలో నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి గురించి, భూమి గొప్పతనం గురించి, భాష విలువను తెలియజేసే కార్యక్రమమే ఈ మాతృమాత మాతృభూమి మాతృభాష అని వివరములు తెలియజేశారు. శాంతి స్కూల్ నిర్వాహకులు – వరల్డ్ రికార్డ్ గ్రహీత, డా. శాంతి స్వరూప్ పిల్లల చేత తల్లికి పాదాభివందనం, పాద పూజ కార్యక్రమం, తల్లులచే పిల్లలకు ఆశీర్వచనం నిర్వహించారు. శాంతి స్కూల్ పిల్లలను, తల్లులను ఉద్దేశించి మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎంతో గొప్ప వారని, వారిని ఎలా గౌరవించాలో స్వీయ ఉదాహరణ ద్వారా వివరించారు. తను తల్లిదండ్రులకి ఇప్పటికీ పాదాభివందనం చేస్తానని అలాగే పిల్లలందరూ తల్లిదండ్రులను గౌరవించాలని వారి మాటకు విలువ ఇవ్వాలని శాంతి స్కూల్ పిల్లలకు సూచించారు. ఈ కార్యక్రమంలో శాంతి స్కూల్ పిల్లలు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు అని జున్నూరి శ్రీనివాస్, గణేశ్వరి దంపతులు మరియు గ్రామ పెద్దలు అభినందించారు. స్కూల్ కరస్పాండెంట్ వెంకట సత్య ప్రసాద్, జయ లక్ష్మి, శివ రావు మాష్టారు, నాగేంద్ర కుమార్,కళ్యాణి, గౌతమ్ గౌడ్, భవాని, డి. లక్ష్మి, దుర్గాదేవి, వనిత, బేబీ, రాజేశ్వరి, సత్య వేణి తదితర స్కూల్ కోఆర్డినేటర్లు స్కూల్ సిబ్బంది, గ్రామ పెద్దలు విద్యార్థులు ఉల్లాసంగా కార్యక్రమానంతరం విందు కార్యక్రమంలో పాల్గొన్నారు.