Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 22 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ


ఆపదలో ఉన్న వారికి

ముఖ్యంగా రక్తం అత్యసరమైన రోగులు, క్షతగా త్రులకు అమలాపురం ఆజాద్ ఫౌండేషన్ చేయూ తగా నిలిచి తమ వంతు సహాయ సహకారాన్ని అందిస్తోందని ఆ సంస్థ వ్యవస్థాపకుడు యల్లమి ల్లి నాగసుధాకొండ అన్నారు. స్థానిక ఓ ప్రైవేటు హాస్పిటల్లో ఓ రోగికి అత్యవసర శస్త్రచికిత్స సందర్భంగా రక్తం అవసరమైతే తమ ఫౌండేషన్ సభ్యుడు దంగేటి వెంకటరమణ సోమవారం రక్త దానం చేశారని నాగసుధాకొండ తెలిపారు. ఇప్ప టికి పది సార్లు రక్తదానం చేసిన వెంకటరమణను ఈ సందర్భంగా అభినందించారు. రక్తం దానం చేసేందుకు తమ ఫౌండేషన్ సభ్యులు సిద్ధంగా ఉంటారని తెలిపారు.