

జనం న్యూస్ ఏప్రిల్ 22 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ఆపదలో ఉన్న వారికి
ముఖ్యంగా రక్తం అత్యసరమైన రోగులు, క్షతగా త్రులకు అమలాపురం ఆజాద్ ఫౌండేషన్ చేయూ తగా నిలిచి తమ వంతు సహాయ సహకారాన్ని అందిస్తోందని ఆ సంస్థ వ్యవస్థాపకుడు యల్లమి ల్లి నాగసుధాకొండ అన్నారు. స్థానిక ఓ ప్రైవేటు హాస్పిటల్లో ఓ రోగికి అత్యవసర శస్త్రచికిత్స సందర్భంగా రక్తం అవసరమైతే తమ ఫౌండేషన్ సభ్యుడు దంగేటి వెంకటరమణ సోమవారం రక్త దానం చేశారని నాగసుధాకొండ తెలిపారు. ఇప్ప టికి పది సార్లు రక్తదానం చేసిన వెంకటరమణను ఈ సందర్భంగా అభినందించారు. రక్తం దానం చేసేందుకు తమ ఫౌండేషన్ సభ్యులు సిద్ధంగా ఉంటారని తెలిపారు.