

జనం న్యూస్ ఏప్రిల్ 22 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి
కొమురం బీం ఆసిఫాబాద్ వాంకిడి మండలంలోని బంబార రైతు వేదికలో మంగళవారం పోషణ పక్వాడ ఏడవ విడత ఈనెల 8 నుండి 22 తేదీ వరకు జరిగే అవగాహన కార్యక్రమాలను ఐసిడిఎస్ ఇంచార్జి సిడిపిఓ రేబ్కా ఆధ్వర్యంలో ఘనంగా ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జి సిడిపిఓ రేబ్కా మాట్లాడుతూ చిన్నారుల్లో, బాలింతల్లో, గర్భిణీ స్త్రీలల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకే పోషణ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని సిడిపిఓ రేబ్కా అన్నారు. లబ్ధిదారులకు గర్భిణీ మొదటి రోజు నుండి రెండు సంవత్సరాల నిండే వరకు 1000 రోజుల ప్రాముఖ్యత మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరిస్తూ, చిరుధాన్యాల ప్రయోజనాలు, వినియోగం, స్థానికంగా దొరికే ఆహార పదార్థాలు వాటిని వినియోగించడం వలన కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించారు. ప్రతి రోజు తీసుకొనే ఆహారం స్థానంలో పోషకాలు మెండుగా ఉండే చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజ లవణాలు లభిస్తాయన్నారు. దీంతో రక్తవృద్ధి ,ఎదుగుదల,రోగనిరోధకశక్తి పెరగడంతో పాటు జీవక్రియ మెరుగుపర్చడంతో శరీరం సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. కావున అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న సేవలను సధ్వినియోగించుకోవాలన్నారు. అనంతరం గర్భిణీలకు సీమంతం నిర్వహించడంతోపాటు చిన్నారులకు అన్నప్రసాన, అక్షరాభాష్యం నిర్వహించారు. ప్రాజెక్ట్ పరిధిలో అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు సూపర్వైజర్లకు,పోషణ అభియాన్ సిబ్బందికి,అంగన్వాడీ టీచర్స్ లకు అభినందలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు కుమారి,భారతి, పోషణ అభియాన్ బ్లాక్ కో ఆర్డినేటర్ తౌఫీక్,జిల్లా బాలల సంరక్షణ విభాగం సోషల్ వర్కర్ డోoగ్రి. ప్రవీణ్ కుమార్, అంగన్వాడీ టీచర్స్,ఆశా వర్కర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.