

జనం న్యూస్. ఏప్రిల్ 22. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)
నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని నోవార్టిస్ నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ సంస్థ చైర్మన్ విజయ్ సుందర్. ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థిని,విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్. క్రీడా సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్. పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థిని విధ్యార్ధులు చదువుతోపాటు క్రీడల్లో కూడా బాగా రాణించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున ఆగ్రో పౌండేషన్ సంస్థకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్ధులకు క్రీడల్లో రాణించేందుకు ప్రజా ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. విద్యార్ధిని,విద్యార్థులు క్రీడల్లో రాణించి,తమ భవిష్యత్తును బంగారు బాటలు వేసుకునే విధంగా ఉండాలని,క్రీడల్లో ఒక లక్ష్యం ఏర్పరచుకొని ఆ లక్ష్యాన్ని చేరుకొనే విధంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో.ప్రభుత్వ అధికారులు. ఆర్డిఓ మహిపాల్ రెడ్డి.ఎంపీడీవో. మధులత..ఎంఈఓ.తారా సింగ్.నాయకులు.మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గుప్త, నర్సాపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రిజ్వాన్,నర్సాపూర్ మండల పార్టీ అధ్యక్షులు మల్లేష్, నర్సాపూర్ మండల ఓబీసీ సెల్ అధ్యక్షులు అశోక్ గౌడ్, నర్సాపూర్ మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు అజ్మత్, జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు శివ ప్రసాద్ గౌడ్, నర్సాపూర్ మండల ఓబీసీ సెల్ కార్యదర్శి మహేష్ గౌడ్, దాడిగా నరేష్, మల్లేష్ యాదవ్. ఆంజనేయులు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
