

జనం న్యూస్ // ఏప్రిల్ // 22 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ నుండి రిసర్చ్ స్కాలర్స్ హర్షిత మరియు రంజిని తెలంగాణ రాష్ట్రము లో ఉన్నటువంటి వివిధ వ్యవసాయ మార్కెట్ల ను సందర్శిస్తున్నారు. అందులో భాగముగా జమ్మికుంట పత్తి మార్కెట్ యార్డ్ ను సందర్శించి రోజు జరిగే క్రయ విక్రయాలను పరిశీలించి విధి విధానాల గురించి మరియు కాటన్ ఉత్పత్తి గురించి, జీన్నింగ్ మిల్స్ గురించి, తెలుసుకున్నారు. వీరి వెంట మార్కెట్ ఛైర్ పర్సన్*శ్రీమతి పుల్లూరి స్వప్న – సదానందం మరియు వైస్ – చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి, పాలక వర్గం సభ్యులు, మార్కెట్ కార్యదర్శి ఆర్. మల్లేశం, ద్వితీయ శ్రేణి కార్యదర్శి ఎన్. రాజా, మార్కెట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.