

జనం న్యూస్ // ఏప్రిల్ // 22 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
తెలంగాణ ఇంటర్ బోర్డ్ మంగళవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో జమ్మికుంట పట్టణంలోని స్రవంతి జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ దుందుభి మోగించారని కళాశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ పుల్లూరి సంపత్ రావు, నడిపెల్లి శ్రీనివాస్ రావు తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరము ఫలితాలలో ఎంపిసి కి చెందిన రావుల అనుదీప్ 1000 మార్కులకు గాను 988 మార్కులు, బి, సిఇసి కి చెందిన మోటపోతుల శ్రీజన్ 1000 మార్కులకు గాను 924 మార్కులు, ఇంటర్ ప్రథమ సంవత్సరము ఫలితాలలో ఎంపిసి కి చెందిన ఎండి అస్లాం, అభినయ్ 470 మార్కులకు గాను 440 మార్కులు, సీఈసీ కి చెందిన గుంపుల మానస 500 మార్కులకు గాను 476 మార్కులు, మెరుగు రక్షిత 464 మార్కులు సాధించారని తెలిపారు. వీరిని కళాశాల అధ్యాపకులు విజయ్ రహమాన్ దొరబాబు సమ్మయ్య రాజేందర్ తదితరులు అభినందించారు..