

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 22 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
రాష్ట్ర బిజెపి అధ్యక్షులు రాజమండ్రి పార్లమెంటు ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి పుట్టినరోజు వేడుకలు పట్టణ బిజెపి కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఓబిసి ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కేకు కట్ చేసి ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ అధ్యక్షులు జడబడ పుల్లయ్య, ఉపాధ్యక్షులు అడుసుమల్లి వెంకటేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి పోతవరం సుభాని, పట్టణ ఓబిసి అధ్యక్షులు కళ్యాణదుర్గారావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అన్నపరెడ్డి లక్ష్మణ్, ఏడవ వార్డు మైనార్టీ మోర్చా నాయకులు షేక్ సుభాని,నాదెండ్ల మండల మైనార్టీ మోర్చా నాయకుల తోపాటు అధ్యక్షులు పట్టణ ఓబీసీ ప్రధాన కార్యదర్శి మాచర్ల శ్రీనివాసరావు, నాయకులు గుమ్మ బాలకృష్ణ, ఎస్సీ మోర్చా నాయకులు నలమాల పేరయ్య, జె.రాయుడు, మండల బీసీ నాయకులు ముతకన అంకమ్మరావు, తదితర నాయకులు పాల్గొన్నారు.