Listen to this article

జనం న్యూస్ // ఏప్రిల్ // 22 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..

జమ్మికుంట మండలం నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఎన్నికల విభాగంలో జిల్లా అధ్యక్షులు నీలం మొండయ్య నాయి , గౌరవ అధ్యక్షులు అవదుర్తి లక్ష్మణ్ నాయి ప్రధాన కార్యదర్శి జంపాల సంపత్ నాయి , ఉపాధ్యక్షులు అంబదాసు నాయి ని మర్యాదపూర్వకంగా నాయి బ్రాహ్మణ సేవ సంగం నాయకులు కలవడం జరిగింది. ఇ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ జమ్మికుంట మండలం నాయి బ్రాహ్మణ సేవా సంఘానికి నూతనంగా ఏర్పడిన అధ్యక్షులు విజ్జిగిరి రాజు మరియు ప్రధాన కార్యదర్శి కొత్తగట్టు భాస్కర్ కి అభినందనలు తెలియజేశారు. జమ్మికుంట నాయి బ్రాహ్మణ సేవా సంఘానికి చెందిన నాయకులకి సభ్యులకి ఎప్పుడు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఏ విధంగానైనా ప్రతి ఒక్క సంఘ సభ్యులకి అభివృద్ధి చేసే కార్యక్రమాలలో ముందు ఉంటామని వారు మాట ఇచ్చారు. జమ్మికుంట మండలం యొక్క సంఘం ఐక్యతని వారు కొనియాడుతూ , ఎల్లవేళలా ఒకరికొకరు తోడ్పాటు చేకూరుస్తూ అందరూ సహకరిస్తూ అభివృద్ధి పంతంలో నడవాలని వారి యొక్క అనుభవంలోని విలువైన సూచనాలను, సలహాలను సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క సంఘ సభ్యులకు అభినందనలు తెలియజేసారు.